జడ్చర్ల, ఏప్రిల్ 25 : ఏటా రెండు కో ట్ల ఉద్యోగాలిస్తామని అధికారంలోకి వ చ్చిన కేంద్రం.. ఆ తర్వాత జాబ్ల ఊసెత్తడం లేదని మాజీ మంత్రి, జడ్చర్ల ఎ మ్మెల్యే లక్ష్మారెడ్డి మండిపడ్డారు. మండలంలోని మాచారం గ్రామ శివారులో మంగళవారం బీఆర్ఎస్ నియోజకవర్గస్థాయి ప్రతినిధుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీఆర్ ప్రధాని అయితే దేశాన్ని ప్రపంచంలో నంబర్వన్గా నిలుపుతారని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రతి పథకానికి తామే డబ్బులు ఇస్తున్నామని కేంద్రం చెబుతున్నదని.. మరి ఇక్కడ అమలవుతున్న పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎందుకులేవని ప్ర శ్నించారు. దేశంలోని ఏ రాష్ట్రం కూడా ఈ పదేండ్ల లో 10 వేల ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. కానీ, తె లంగాణలో ఇప్పటికే 1.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని, మరో 90 వేల జాబ్లకు నోటిపికేషన్ వి డుదల చేశామన్నారు. బీజేపీ సర్కార్ కనీసం 200 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని, ఏ మొహం పెట్టుకొని నిరుద్యోగ మార్చ్ చేస్తున్నారో ప్రజలకు చెప్పాలన్నారు.
ముస్లిం రిజర్వేషన్లను రద్దుచేస్తామంటున్న బీజేపీ.. ఓబీసీ రిజర్వేషన్లు ఎందుకు పెట్టిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ 50 ఏండ్లు అధికారంలో ఉండి ప్రజలకు ఏమీ చేయలేకపోయింద ని, మళ్లీ ఇప్పుడు ఒక్క అవకాశం ఇవ్వాలని అడగడం హాస్యాస్పదమన్నారు. ప్రజలు పనిచేసే ప్రభుత్వానికి అండగా ఉండి.. వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని కో రారు. సభకు దాదాపు 2వేల మంది పార్టీ ప్రతినిధులు హాజరయ్యారు. అంతకుముందు ఆరు తీర్మానాలను ప్రవేశపెట్టారు. కళాకారుల ఆటాపాటలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య, జీసీసీ చైర్మన్ వాల్యానాయక్, సంగీత, నాటక అకాడమీ మాజీ చైర్మన్ బాద్మి శివకుమార్, సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రణీల్చందర్, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, నాయకులు రఘుపతిరెడ్డి, లక్ష్మయ్య, జంగయ్య, నర్సింహులు, రవీందర్రెడ్డి, ప్రశాంత్రెడ్డి, ముడా డైరెక్టర్లు శ్రీకాంత్, ఇంతియా జ్, ఉమాదేవి, లత, రమేశ్, చైతన్య, శ్రీశైలమ్మ, శ్రీ నివాస్రెడ్డి, నాగిరెడ్డి, బచ్చిరెడ్డి, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.