జడ్చర్ల టౌన్, జనవరి 10 : రాష్ట్రంలోని అన్ని గ్రా మాల్లో సమగ్రాభివృద్ధి జరుగుతున్నదని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని కోడుగల్లో మంగళవారం ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డితో కలిసి ఎమ్మె ల్యే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మొదటగా గ్రామంలోని పలు కాలనీల్లో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు భూమి పూజ చేసి ప్రారంభించా రు.
ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు యూనిఫాం అందజేశారు. అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి నూతన భవన నిర్మాణానికి హామీనిచ్చారు. నూతన మహిళా సంఘం భ వనం, ఎస్సీ కమ్యూనిటీ హాల్, అంగన్వాడీ ప్రహరీ ని ర్మాణ పనులకు భూమి చేశారు. మహిళలకు రూ.26.50 లక్షల చెక్కును అందజేశారు. అనంతరం వరి యంత్రాన్ని ప్రారంభించారు. రైతులకు మంజూరైన పైపులను పంపిణీ చేశారు.
అంతకుముందు ఎంపీ, ఎమ్మెల్యేకు గ్రామస్తులు, నాయకులు మేళతాళాలతో గ్రామ చావిడి నుంచి అన్ని వీధుల మీదుగా ఊరేగింపుగా వెళ్తూ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అడుగడుగునా గ్రామస్తులు వారిని శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ గోవర్ధన్రెడ్డి, వైస్ చైర్మన్ దానిష్, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రణీల్చందర్, ముడా డైరెక్టర్ ఇంతియాజ్, ఎంపీడీవో ఉమాదేవి, ఏఈ జోవహార్బాబు, సర్పంచ్ మమత నవీన్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు నాగిరెడ్డి, రామ్మోహన్, మసీయోద్దీన్, వెంకట్రెడ్డి, నవీన్రెడ్డి, కొంగళి జంగయ్య తదితరులు పాల్గొన్నారు.