గద్వాల, ఏప్రిల్ 9 : ప్రజలకు నాయకులు సేవ చేసి రుణం తీర్చుకోవాలని బీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రా వు సూచించారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్ అధ్యక్షతన ఆదివారం బీఆర్ఎస్ ఆత్మీ య సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ రవీందర్రావు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భం గా ఎమ్మెల్సీ మాట్లాడుతూ మహిళా ప్రజాప్రతినిధులు 33 శాతం రిజర్వేషన్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎవరికి ఏ సమస్య ఉన్నా పరిష్కరించేందు కు కృషి చేస్తామన్నారు.
అన్నదాతల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు పాటుపడుతున్నారన్నారు. రైతుబంధు, రైతుబీమా, నిరంతర ఉచిత వి ద్యుత్, సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు.., రైతువేదికల ద్వారా సూ చనలు, సలహాలు అందిస్తున్నారన్నారు. పేదల కడుపునిండా అ న్నం పెట్టడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఏ ఒక్క ఆడబిడ్డ కూడా బిందెలు పట్టుకొని నీటి కోసం పా ట్లు పడకూడదన్న ఉద్దేశంతో మిష న్ భగీరథ ద్వారా ఇంటింటికీ న ల్లా కనెక్షన్లు ఇచ్చి స్వచ్ఛ జలాన్ని అందజేస్తున్నట్లు చెప్పారు. నాయకులు ఎప్పుడూ ప్రజాపక్షం వైపు నిలబడాలని సూచించారు. బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్ కుటుంబం మీద అవినీతి మరకలు అంటించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ము ఖ్యమంత్రి నేతృత్వంలో దేశం గర్వించదగ్గ పథకాలు అ మలవుతున్నాయన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. పార్టీని విభేదించి నష్టపోవద్దని సూచించా రు. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తున్న వారి ని సహించేది లేదన్నారు. దేశరాజకీయాల్లో కేసీఆర్ సం చలనం సృష్టించడం ఖాయమన్నారు. ఈ నెల 25న ని యోజకవర్గ కార్యకర్తల సమావేశాలు ఉంటాయని చెప్పా రు. ఎమ్మెల్యే బండ్ల మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. గత కౌన్సిల్ ఇందిరమ్మ ఇండ్ల పేరిట రూ.లక్షలు దోచుకున్నారని ఆరోపించారు. ఇప్పటివరకు ఎలాంటి మచ్చ లే కుండా తమ కౌన్సిల్ పాలన సాగించిందన్నా రు. కౌన్సిలర్ల సహకారంతోనే గద్వాలలో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. వారం, పది రో జుల్లో డిప్ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి డబుల్బెడ్రూం ఇండ్లు అందజేస్తామన్నారు.
ఇండ్లు రాని అర్హులకు రెండు నెలల్లో సుమారు 3 వేల ప్లాట్లకు సంబంధించి పట్టాలు ఇస్తామన్నారు. గతానికి, ఇప్పటికీ జరిగిన అభివృద్ధిని ప్రజలు బేరీజు వేసుకోవాలన్నారు.కార్యకర్తల న మ్మకాన్ని ఎప్పుడూ వమ్ముచేయమన్నారు. వా స్తవం ఉంటేనే మాట్లాడే మనస్తత్వం తనదన్నా రు. మున్సిపల్ చైర్మన్ కేశవ్ మాట్లాడుతూ ము న్సిపాలిటీలో 30 పార్కులు ఏర్పాటు చేశామన్నారు. వినియోగదారుల ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప మాట్లాడుతూ డీకే కుటుంబం స్వార్థ రాజకీయాల కోసం భార్యాభర్తల మధ్య గొడవలు సృష్టిస్తారన్నారు. అంతకుముం దు సభావేదిక వరకు కార్యకర్తలు బైక్ర్యాలీ నిర్వహించా రు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రా మన్గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీధర్గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ బాబర్, పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోవిందు, సాయిశ్యాంరెడ్డి, కౌన్సిలర్లు, నాయకు లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.