అచ్చంపేట, మే 23 : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దివా ళా తీసిందని, ఎన్ని జోడో యాత్రలు, పొర్లు దండాలు పెట్టినా లాభం లేదని, ప్రజలు ఆ పార్టీకి ఎప్పుడో బొందపెట్టారని ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తెలిపారు. అచ్చంపేట మండలంలోని బీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలతో మంగళవారం సమావేశం నిర్వహించారు. గ్రామాల వారీగా సమస్యలు, అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ సందర్భంగా విప్ గువ్వల మాట్లాడుతూ సీసీరోడ్లు, డ్రైనేజీ, ఆలయాల ని ర్మాణాలకు నిధులు కేటాయించామని.. వాటిని పూర్తి చేసిన తర్వాత మరిన్ని నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉ న్నామన్నారు. ముందుగా పురోగతిలో ఉన్న రోడ్లను పూ ర్తి చేయాలన్నారు. గ్రామాలో కరెంట్ సమస్యలను వెంట నే పరిష్కరించాలని డీఈ, ఏఈలను ఆదేశించారు. అధికారుల స్థాయిలో పరిష్కారం కాలేని సమస్యలను తన దృష్టికి తీసుకురావాలన్నారు. చౌటపల్లితండాను ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేస్తామన్నారు. ఘణపురం, ఘణపురంతండా, శివారుతండాల్లోని డొంకరోడ్లను బాగు చేయిస్తానన్నారు. ప్రతాపరుద్రుడితండాకు బీటీ లేదా మట్టి రోడ్డు వేయిస్తామన్నారు. అచ్చంపేటలో బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు చాలా మంది టచ్లో ఉన్నారని, సమయం వచ్చినప్పుడు పార్టీలో చేర్చుకుంటామన్నారు. తొమ్మిదేండ్లల్లో జరిగిన అభివృద్ధిని చూసి భారతదేశం గర్విస్తుందని, ఎక్కడా చిన్న మరక లేకుండా పాలనే కొనసాగిస్తున్నామన్నా రు.
ఎప్పుడు ఎన్నికలు వచ్చిన బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని ధీమా వ్య క్తం చేశారు. అచ్చంపేటలో 50 వేల మెజార్టీ వస్తుందని అనేక సర్వేలు చెబుతున్నాయన్నారు. గతం కన్నా ఈసారి పార్టీ, క్యాడర్ బలంగా ఉందన్నారు. ఈ నెల 29వ తేదీన అచ్చంపేటకు ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు వస్తున్నారని, సభకు ప్రజలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. వరుసగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పర్యటనలు ఉంటాయన్నారు. ప్రజలు, రైతులు, కర్షకులు తమ వెంటే ఉన్నారని, ఈసారి 100 సీట్లు రా వడం ఖాయమన్నారు. ఉమామహేశ్వరం, రాయలగండి చెన్నకేశవస్వామి, నిరంజన్షావలీ, మద్దిమడుగు రిజర్వాయర్లను పూర్తి చేసి.. కృష్ణమ్మ నీళ్లను పారించడమే తన జీవిత లక్ష్యమన్నారు. నియోజకవర్గంలో సీసీరోడ్లు, డ్రైనేజీలు, ఆలయాలు, కమ్యూనిటీ భవనాలకు రూ.30 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆగడాలు, దాడులను ప్రజలు గమనిస్తున్నారని, ఆ పార్టీ నాయకులు రెచ్చగొట్టేలా ఎన్ని వ్యాఖ్యలు చేసినా బీఆర్ఎస్ శ్రే ణులు ఓపికతో ఉండాలని సూచించారు. వచ్చే నెల 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యే తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలన్నారు. సమావేశం లో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు మనోహర్, మం డలాధ్యక్షుడు రాజేశ్వర్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పర్వతాలు, జెడ్పీటీసీ మంత్రియానాయక్, సర్పంచ్ లో క్యానాయక్, పీఏసీసీఎస్ చైర్మన్ రాజీరెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి, మద్దిమడుగు ఆలయ కమిటీ చైర్మన్ విష్ణుమూర్తి, పట్టణ అధ్యక్షుడు రమేశ్, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీధర్, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌ న్సిలర్లు, నాయకులు ఉన్నారు.