జడ్చర్లటౌన్, నవంబర్ 13 : తెలంగాణలోని అన్ని వర్గాల వారికి మంచి చేసి బీఆర్ఎస్ పార్టీని ఈ అసెంబ్లీ ఎన్నికలల్లో కారుగుర్తుకు ఓటు వేసి గెలిపించాలని జడ్చర్ల బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగం గా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జడ్చర్లలోని మినీ స్టేడియం మైదానంలో క్రీడాకారులను, అలాగే మార్నింగ్ వాకర్స్, యోగా కమిటీ సభ్యులతో కలిసి మాట్లాడారు. క్రీడాకారులు ప్రాక్టిస్ చేసేందుకు గానూ జ డ్చర్ల మినీస్టేడియాన్ని అన్ని విధాల అభివృద్ధి చేశానని తెలిపారు. స్టేడియంలో జరిగిన అభివృద్ధిని చూసి తనకు మద్దతు తెలిపి కారు గుర్తుకే ఓటు వే సి మరోసారి తనను గెలిపించాలని కోరారు. అలా గే మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో కాలనీవాసులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. 23వ వార్డులో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికి తిరిగి అమ్మ బాగున్నారా.. నీళ్లు, కరెంటు మంచిగా వస్తుందా అని అప్యాయంగా పలకరించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందించిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తే మరిన్ని సంక్షేమ పథకాలు అందుతాయ ని చెబుతూ బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించారు. కారు గుర్తుకే ఓటు వేస్తాం.. హాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపిస్తామంటూ వార్డు ప్రజలు ఎమ్మెల్యేను ఆశీర్వాదించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కా ర్యకర్తలు భారీగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నా రు. నవాబ్పేట మండలం కూచుర్ గ్రామానికి చెందిన 40 మంది గొల్లకురుమల సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకున్నారు. గొల్లకురుమలందరూ బీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తూ బీఆర్ఎస్లో చేరుతున్నామని గొల్లకురుమల సంఘం సభ్యులు తెలిపారు. అలాగే నవాబ్పేట మండలం కారుకొండ గ్రామానికి చెందిన వందమంది కాం గ్రెస్, బీజేపీ నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. బాలానగర్ మండలం నం దారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరినవారందరికీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గులాబీ కండువాలు వేసి ఆహ్వానించారు.
బాలానగర్, నవంబర్ 13 : కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రాష్ట్రం చీకటి అవుతుందని, మళ్లీ పాతరోజులే వస్తాయని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని మన్యంగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని పలు తండాల్లో ఆదివారం బీఆర్ఎస్ మండల నాయకులతో కలిసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అంతకుముందు ఎమ్మెల్యే సమక్షంలో పలువురు యువకులు బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో టీజీసీసీ చైర్మన్ వాల్యానాయక్, డీసీఎంఎస్ చైర్మన్ పట్ల ప్రభాకర్రెడ్డి, గిరిజన రాష్ట్ర నాయకుడు లక్ష్మణ్నాయక్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ వెంకటాచారి, ఎంపీటీసీలు అభిమాన్యురెడ్డి, లింగూనాయక్, సింగిల్ విండో డైరెక్టర్ మంజూనాయక్ ఉన్నారు.
జడ్చర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి మద్దతుగా ఎమ్మెల్యే తనయుడు స్వరూణ్ బాబు సోమవారం మండలంలోని మోతీఘణపూర్, గౌతాపూర్ గ్రామాల్లో బీఆర్ఎస్ యూత్ వింగ్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వరూణ్ బాబు ఇంటింటికీ తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, మ్యానిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ యూత్ వింగ్ మండలాధ్యక్షుడు సుప్ప ప్రకాశ్, దేశ్ముఖ్ ప్రతాప్రెడ్డి, యాదిరెడ్డి, మహ్మద్పాషా, తెప్ప మణి, రమేశ్, సాయిలు, రామకృష్ణ, శ్రీకాంత్ పాల్గొన్నారు.
మిడ్జిల్, నవంబర్ 13 : మండలంలోని వెలుగొమ్ముల గ్రామానికి చెందిన రాములు ప్రమాదవశాత్తూ బైక్పై నుం చి కిందపడడంతో గాయపడ్డా రు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కార్యకర్తకు మెరుగైన చిక్సిత కోసం రూ.10వేలు ఆర్థికసాయం అందజేశారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు రఘుపతిరెడ్డి, బాల్రెడ్డి, సాయిలు, మన్యం, సత్యంగౌడ్, శేఖర్రెడ్డి, జగత్రెడ్డి ఉన్నారు.
నవాబ్పేట, నవంబర్ 13 : మండలంలోని ఊరంచుతండాకు చెందిన పలువురు కాంగ్రెస్ నా యకులు, యువకులు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఊరంచుతండాకు చెందిన రఘునాయక్, శివ, కిషన్, సిద్దుతోపాటు మరో 40మంది యువకులు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రవీందర్రెడ్డి, సింగిల్విండో చైర్మన్ నర్సింహులు, ముడా డైరెక్టర్ చెన్నయ్య, మాజీ ఎంపీపీ శీనయ్య, నాయకులు ఉన్నారు.