మక్తల్ టౌన్, ఏప్రిల్ 20: మక్తల్ మండలంలో త్వరలో పాడిరైతులతో పాడిరైతుల ఉత్పత్తి సంఘాలు ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పేర్కొన్నారు. గురువారం నాబార్డు నుంచి మక్తల్ మండలంలో ఏర్పాటు చేసే పాలడైరీ ప్రొసీడింగ్ కాపీని ఎన్జీవోస్కు ఎమ్మెల్యే చిట్టెం తన నివాసంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పాడిరైతు ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం నాబార్డు ద్వారా అవకాశం కల్పించిందని తెలిపారు. పాడి ఉత్పత్తి చేస్తున్న ప్రతిరైతునూ సంఘంలో చేర్పించుకుని సంఘాల నుంచి ఎన్ని డబ్బులు జమ అవుతాయో నాబార్డు సంస్థ నుంచి పాడి ఉత్పత్తిదారులకు రుణ సదుపాయం కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
పాడి ఉత్పత్తి సంఘాల ఏర్పాటు అనంతరం ఆయా రైతులకు బ్యాంకుల నుంచి రుణాలు అందించనున్నట్లు తెలిపారు. పాడిరైతులందరూ కలిసి పాల ఉత్పత్తులను పెంపొందించుకోవడంతోపాటు స్వయంగా రైతులే పాలకేంద్రాన్ని నడిపించుకునే అవకాశాన్ని నాబార్డ్ కల్పిస్తందని తెలిపారు. మండలంలోని పాడిరైతులందరూ పాడిరైతు ఉత్పత్తిదారు సంఘం ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రామలింగం, బండారి శేఖర్, మల్రెడ్డి, నాబార్డ్ ఎన్జీవో కుర్మయ్య, ఎస్ఐఆర్డీ చాంద్ సుల్తానా, రాధిక తదితరులు ఉన్నారు.
సీఎంఆర్ఎఫ్ వరంలాంటిది
దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారికి సీఎం సహాయ నిధి వరంలాంటిదని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. మక్తల్ పట్టణానికి చెందిన డి.నరేందర్కు సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన చెక్కును ఎమ్మెల్యే చిట్టెం నివాసంలో లబ్ధిదారుకు గురువారం అందజేశారు.
బండారుకు హాజరుకావాలి
మాగనూర్ మండలంలోని వర్కూర్లో ఈనెల 28న నిర్వహించే బీరప్ప బండారు మహోత్సవానికి హాజరుకావాలని ఎమ్మెల్యే చిట్టెంకు వర్కూర్ గ్రామ కుర్వ కులస్తులు ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం బీరప్ప ఉత్సవాలకు సంబంధించిన వాల్పోస్టర్ను ఆవిష్కరించారు.
బీఆర్ఎస్ కార్యకర్త మృతికి సంతాపం
ఊట్కూర్, ఏప్రిల్ 20: మండలంలోని లక్ష్మీపల్లికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త మేస్త్రి హన్మంతు (40) గురువారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యకర్త మృతిపై విచారం వ్యక్తం చేస్తూ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. మృతుడి ముగ్గురు పిల్లలను చదివించడంతోపాటు అన్నివిధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట జెడ్పీటీసీ అశోక్కుమార్గౌడ్, మాజీ జెడ్పీటీసీ అరవింద్కుమార్, బీఆర్ఎస్ అధ్యక్షుడు బస్సప్ప, సాయిలు పాల్గొన్నారు.
ఉత్సవాలకు ఏర్పాటు చేయాలి
మాగనూర్, ఏప్రిల్ 20: మండలంలోని వర్కూర్ బైరంపల్లిలో ఈనెల 27 నుంచి నిర్వహించబోయే బీరప్ప బండారు ఉత్సవంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులు, పోలీసులకు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి సూచించారు. అంతకుమందు వర్కూర్లో నిర్వహించనున్న బండారోత్సవానికి హాజరుకావాలని ప్రధాన పూజారులు ఎర్రప్ప, లింగప్ప, అనంపల్లి లింగప్ప ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డిని గురువారం క్యాంపు కార్యాలయంలో కలిసి ఆహ్వానపత్రికను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ నిర్మలామల్రెడ్డి, ఎంపీటీసీ ఎల్లారెడ్డి, వైస్ ఎంపీపీ తిప్పయ్య, భైరంపల్లి సర్పంచ్ మంజులారాఘవేందర్, పురుషోత్తంగౌడ్, రాఘవేందర్గౌడ్ ఉన్నారు.