నర్వ, నవంబర్ 25 : కళ్లబోల్లి మాటలు చెప్పే కాంగ్రెస్ నాయకుల మాయమాటలను నమ్మొద్దని బీఆర్ఎస్ అభ్యర్థి, మక్తల్ ఎమ్మెల్యే అభ్యర్థి చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. శనివారం నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని నర్వ మండలం బెక్కర్పల్లి, పెద్దకడ్మూర్, ఎల్లంపల్లి, కొత్తపల్లి, లక్కర్దొడ్డి, నాగిరెడ్డిపల్లి, యాంకి, జక్కన్నపల్లి, రాయికోడ్, సీపూర్, కల్వాల గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయా గ్రామాల్లో పర్యటించి రోడ్షోలు నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లెపల్లెల్లో మంగళహారతులతో మహిళలు ఎమ్మెల్యే చిట్టెంకు స్వాగతం పలికారు. బొడ్డెమ్మలు, కోలాటలతో నృత్యాలు చేస్తూ ప్రతి గ్రామంలో ఆలయాల్లో పూజలు చేసి రోడ్షోలు చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యే చిట్టెం మాట్లాడుతూ కొత్తబిచ్చగాడు పోద్దెరుగడన్నట్లు, బతుకుదెరువు కోసం వెళ్లి ఐదు ఏండ్లకోసారి బండారుకు వచ్చినట్లు కాంగ్రెస్ వ్యవహారం ఉందని ఆయన ఎద్దేవా చేశారు.
స్థానికంగా ఉండారు ఎన్నికల సీజన్కు వస్తారు మాయ మాటలు చెప్పి పత్తాలేకుండా పోయే వాళ్ల మాటలు నమ్మకుండదన్నారు. అనేక సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేసి, తెలంగాణలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. గ్రామాల్లో మరింత అభివృద్ధి చేసుకునేందుకు ప్రతిఒక్కరూ కారు గుర్తుకు ఓటేయ్యాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ జయరాములు, సింగిల్విండో చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, మండలాధ్యక్షుడు మహేశ్వర్రెడ్డి, నాయకులు కిరణ్ ప్రకాశ్రెడ్డి, లక్ష్మణ్, వెంకట్రెడ్డి, విజయ్కుమార్, అయ్యన్న, హన్మంత్రెడ్డి, వెంకటేశ్వర్రావు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.