మక్తల్ టౌన్, నవంబర్ 9 : మక్తల్ అసెంబ్లీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి తాసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి మయాంక్మిట్టల్కు గురువారం నామినేషన్ పత్రాలు అందజేశారు. అంతకుముందు ఎమ్మెల్యే చిట్టెం తన స్వగృహం నుంచి ఉదయం 9:55గంటలకు బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి మక్తల్ పట్టణంలోని పడమటి ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సతీమణి చిట్టెం సుచరితరెడ్డితో కలిసి ఆలయం నుంచి తెలంగాణ అమరవీరులను స్మరించుకుంటూ నామినేషన్ పత్రాలతో మక్తల్ తాసీల్దార్ కార్యాలయంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి మాయాంక్మిట్టల్కు మొదటి సెట్ నామినేషన్ పత్రాలను అందజేశారు.
అనంతరం మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడారు. అనంతరం చిట్టెం సతీమణి సుచరితరెడ్డితోపాటు మక్తల్ ఎంపీపీ వనజమ్మ, మాజీ మారెట్ కమిటీ చైర్మన్ రాజేశ్గౌడ్, ఆత్మకూరు మండలం అధ్యక్షుడు రమేశ్తోపాటు మైనార్టీ నాయకులు షేక్ హైమద్ రిటర్నింగ్ అధికారికి రెండవ సెట్ నామినేషన్ అందజేశారు. మూడో సెట్ నామినేషన్ ఆత్మకూర్ మాజీ ఎంపీపీ శ్రీధర్గౌడ్, సర్పంచ్ సూర్యప్రకాశ్రెడ్డి, మక్తల్ బీఆర్ఎస్ నాయకులు రాజుల ఆశరెడ్డి, అన్వర్ హుస్సేన్, రాజు రిటర్నింగ్ అధికారికి అందజేశారు. కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యురాలు చిట్టెం సుచరితారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్గుప్తా, ఊటూరు మాజీ జెడ్పీటీసీ అరవింద్కుమార్ పాల్గొన్నారు.