మక్తల్ టౌన్, డిసెంబర్ 6 : రాష్ట్రంలోని ఆడపిల్లల పెండ్లి కి కల్యాణలక్ష్మి పథకం కొండంత అండ అని ఎమ్మెల్యే చి ట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. మంజూరైన చెక్కులను క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చిట్టెం మంగళవారం 125 మంది లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడబిడ్డ పెండ్లికి అండగా ఉండాలనే లక్ష్యంతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను తీసుకొ చ్చి ఆడపిల్ల పెండ్లికి ఆర్థికసాయం అందజేస్తున్న ఏకైక రా ష్ట్రం తెలంగాణనేనన్నారు.
సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కును ఎమ్మె ల్యే నివాసంలో మండలంలోని సంగంబండ గ్రామానికి చెందిన మహేశ్కు రూ.14,500 విలువ గల చెక్కును లబ్ధిదారుడికి అందజేశారు.
పడమటి ఆంజనేయస్వామి జాతర సందర్భంగా ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఎమ్మెల్యే అన్నా రు. ఆలయ ప్రాంగణాన్ని ఆయన సం దర్శించిన అనంతరం రాంలీల మైదానంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ జాతర ప్రారంభమైన సందర్భం గా బుధవారం నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని అధికారుల ను ఆదేశించారు.
వీరభద్ర బ్రదర్స్ ఆధ్వర్యంలో మినీ స్టేడియంలో ఏర్పా టు చేసిన కబడ్డీ పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకొని గెలుపోటములను సమా నంగా స్వీకరించాలన్నారు.
మక్తల్, డిసెంబర్ 6 : మండలంలోని రుద్రసముద్రం మంగళవారం రుద్రలింగేశ్వరస్వామి జాతర అంగరంగ వై భవంగా ప్రారంభమైంది. ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్వాహకులు, గ్రామస్తులు ఎమ్మెల్యేకు పూలమాల, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అంతకు ముందు స్వామిని కృష్ణానది నుంచి తీసుకొచ్చి జల్దిబిందె సేవ నిర్వహించారు. క్యాక్రమంలో సర్పంచ్ విజయలక్ష్మి, ఎంపీటీసీ వెంకటయ్య, టీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి రాంలింగం, ‘చిట్టెం’ యువసేన నియోజకవర్గ కన్వీనర్ హుసేన్స్ పాషా తదితరులు పాల్గొన్నారు.