కోడేరు, మార్చి 17 : మండల కేంద్రంలోని బీసీ కాలనీలో మిషన్ భగీరథ నీళ్లు సరఫరా కాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు నెలలుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో వాటర్ ట్యాంకులు నిరుపయోగంగా మారాయి. పసుపుల నుంచి కోడేరు మీదుగా నాగులపల్లి వరకు బీటీ రో డ్డు పనులు కొనసాగుతున్నాయి. ఈక్రమంలో కోడేరులోని ఉమామహేశ్వరస్వామి ఆలయం వద్ద వం తెన పనులు చేపట్టారు. దీంతో భగీరథ పైపులైన్ పగిలిపోయి వారం రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది.
దీనికి తోడు ప్రజల అవసరాలకు సరిపడా నీళ్లు రావడం లేదని గ్రహించిన అధికారులు పంచాయతీ వాటర్ట్యాంక్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. అదేవిధంగా పడావులో ఉన్న చేతిపంపులు, గ్రామపంచాయతీ స్కీం బోర్లను మరమ్మతు లు చేసి నీటిని అందించేందుకు ప్రత్యేకాధికారులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే బీసీ కాలనీలో పడావులో ఉన్న బోరుకు మరమ్మతులు చేశా రు. అవసరాలకు అనుగుణంగా అధికారులు తాగునీటిని అందించాలని స్థానికులు కోరుతున్నారు.