పాలమూరు/మక్తల్ టౌన్/అచ్చంపేట/గద్వాల/మూసాపేట, జనవరి 2 : వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని తిరుమలలో మంత్రి, ఎమ్మెల్యేలు సందడి చేశారు. సోమవారం తెల్లవారుజామున ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ ప్రజలందరూ బాగుండాలని కోరానన్నారు. వేంకటేశ్వరస్వామి అనుగ్రహం సీఎం కేసీఆర్కు నిరంతరం ఉండాలని, ఆయన నేతృత్వంలో రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశవ్యాప్తం చేసేలా బీఆర్ఎస్ను విస్తరించాలని వేడుకున్నానన్నారు. మంత్రి వెంట మహబూబ్నగర్ గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, ముడా చైర్మన్ గంజి వెంకన్న, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజేశ్వర్, బీఆర్ఎస్ నాయకులు కృష్ణమోహన్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శివరాజ్ తదితరులు ఉన్నారు. అలాగే ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కుటుంబసభ్యులతో కలిసి స్వామి చెంతన ప్రత్యేక పూజలు చేశారు. మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ఆయన సతీమణి చిట్టెం సుచరిత, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఆయన సతీమణి బండ్ల జ్యోతితో కలిసి స్వామిని వేర్వేరుగా దర్శించుకున్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి కుటుంబసమేతంగా వేంకటేశ్వరస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.