మహబూబ్ నగర్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): జిల్లా కేంద్రం సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పేదల తిరుపతిగా పిలిచే మన్యంకొండ ఆలయానికి అంతర్జాతీయస్థాయిలో మొట్టమొదటి రోప్వే సౌకర్యం కల్పించే న మునాలను రాష్ట్ర పర్యాటక, క్రీడాశాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ ఉన్నతాధికారులు, కన్సల్టెంట్స్తో కలిసి ఆమోదించారు. రాష్ట్రంలోనే ఆలయాల వద్ద నిర్మించే మొట్టమొదటి రోప్వే ఇదే కావడం విశేషం. దీనిని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకం గా తీసుకుంది. నమూనాలను పరిశీలించి శుక్రవా రం తుదిరూపు ఇచ్చారు. అనంతరం మంత్రి శ్రీనివాస్గౌడ్ మీడియాకు ప్రకటన విడుదల చేశారు. విదేశాల్లో ఉన్న కేబుల్కార్ కంటే మన రోప్వే మ రింత అద్భుతంగా ఉండనుందని, మన్యంకొండ రోప్వేకు అనుసంధానంగా కొండమీద ల్యాండింగ్, ల్యాండ్ స్కేపింగ్, స్కైవాక్ డిజైన్లను ఆమోదించినట్లు తెలిపారు. తెలంగాణ తిరుపతి అయినా మ న్యంకొండ ఆలయాన్ని యాదాద్రి, వేములవాడ తరహాలో తీర్చిదిద్దుతామన్నారు. ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. మ న్యంకొండ వద్ద చేపడుతున్న రోప్ వేను స్విట్జర్లాం డ్, దక్షిణ కొరియాలో ఉన్న రోప్వే కంటే అద్భుతం గా ఉండబోతుందన్నారు. దేశీయ పర్యాటకులతోపాటు విదేశీ పర్యాటకులను కూడా ఆకర్షించడమే లక్ష్యంగా నిర్మాణం ఉండనుందని పేర్కొన్నారు.
స్కైవాక్ ద్వారా నేరుగా గుడిలోకి..
కొండపైన కేబుల్ కార్ ద్వారా వెళ్లిన భక్తులు నేరుగా దైవదర్శనానికి వెళ్లేందుకు ఇబ్బంది లేకుం డా ఏర్పాట్లు చేస్తున్నారు. నేరుగా గుడిలో వెళ్లేందు కు స్కైవాక్ నిర్మాణం చేపడుతున్నామని ఇక్కడి నుంచి స్వామిని దర్శించుకోవచ్చన్నారు. కొండపైన అన్నదాన సత్రం, లడ్డూ కౌంటర్, కోనేరు నిర్మాణాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. కొండపైన దిగగానే ల్యాండ్ స్కేపింగ్ అత్యద్భుతం గా ఉండబోతుందన్నారు. రోప్వే స్టేషన్ వద్ద పా ర్కింగ్ ఏరియా, రెస్టారెంట్, ల్యాండ్ స్కేపింగ్, విశాలమైన పార్కింగ్ ఏరియాలను ఏర్పాటు చేస్తారు.
రోప్వేతో తీరనున్న భక్తుల కష్టాలు..
కొండ దిగువ నుంచి కొండపైకి సుమారు కిలోమీటరు మేర నిర్మించనున్న ఈ రోప్ వే వల్ల పర్యాటకులు, భక్తుల కష్టాలు తీరనున్నాయి. అంతేకాక భక్తుల సంఖ్య మరింతగా పెరుగుతుందని, అందు కు అనుగుణంగా సకల సదుపాయాలు కల్పిస్తామని మంత్రి అన్నారు. కొండ దిగువన పర్యాటకుల సౌక ర్యం కోసం ఇప్పటికే హరిత హోటల్ పనులు కొనసాగుతున్నాయన్నారు. పేదల తిరుపతి మన్యంకొండను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. సంస్కృతీ, సంప్రదాయాలు, ఎకో టూరిజం కేంద్రా లు, ఆధ్యాత్మిక కేంద్రాలకు తెలంగాణకు దేశంలోనే ఎంతో గుర్తింపు ఉందని, సీఎం కేసీఆర్ పర్యాటక అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారని వెల్లడించారు. సమావేశంలో ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, పర్యాటకశాఖ ఓఎస్డీ సత్యనారాయణ, టూరిజం కన్సల్టెంట్ కల్పేశ్పటేల్ తదితరులు ఉన్నారు.