తెలంగాణలో జనరంజక పాలన సాగుతున్నదని.. ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజల ఆశీర్వాదంతో ముచ్చటగా మూడోసారి గులాబీ జెండా ఎగురడం ఖాయమని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ పట్టణంతోపాటు మండలంలోని గ్రామాల్లో సోమవారం ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో మంత్రికి మహిళలు బోనాలతో ఘన స్వాగతం పలికారు. డప్పుచప్పుళ్లతో నృత్యాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. మంత్రి ఇంటింటికీ వెళ్లి ఆప్యాయంగా పలుకరిస్తూ కారుగుర్తుకు ఓటువేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. క్రిస్టియన్పల్లిలోని డబూల్బెడ్రూం కాలనీలో ప్రజలంతా మంత్రికి స్వచ్ఛందంగా మద్దతు తెలిపారు. గూడులేని మాకు ఇండ్లు కట్టించి సీఎం కేసీఆర్ దేవుడిలా మారారని ధన్యవాదాలు తెపారు. అనంతరం కాంగ్రెస్, బీజేపీ నాయకులు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
మహబూబ్నగర్ టౌన్/పాలమూరు, అక్టోబర్ 30 : ఎవరెన్ని కుట్రలు పన్నినా.. ప్రజలకు చేసిన మంచే మమ్మల్ని మూడోసారి అధికారంలోకి తీసుకొస్తుందని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ మండలం తువ్వగడ్డ తండా, ఫతేపూర్, భవానీతండా, పల్లెగడ్డతండా, బోడబండతండాలో మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాలకు వెళ్లిన మంత్రికి మహిళలు బోనాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కర్ణాటకలో అక్కడి ప్రజలు కాంగ్రెస్ను నిమ్మితే నిండా ముంచేశారని, కనీసం కరెంటు ఇవ్వడం చేతకావడం లేదన్నారు. దీంతో రైతులంతా నష్టపోయి రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారన్నారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పాటుపడుతుండగా.. రైతుల కడుపుకొట్టేలా రైతుబంధును ఆపేందుకు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయ డం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ను ఇప్పటికే ప్రజలు పాతరేసేందుకు నిర్ణయించుకున్నారని, ప్రజల మధ్య కులమతాల పేరుతో చిచ్చుపెట్టే బీజేపీ పార్టీ తెలంగాణలో అడ్రస్ లేకుండా పోవడం ఖాయమన్నారు. ఫతేపూర్కు చెందిన బీజేపీ నాయకులు శేఖర్, వెంకట్రాములు, శ్రీశైలం, మల్లేశ్, ఖాసీం, కృష్ణ, వెంకటయ్య మంత్రి సమక్షంలో చేరారు.
ఫతేపూర్లో బీబీ అనే మహిళ ఇప్పటికీ కట్టెల పొయ్యి మీద వంట వండుతున్నది. గమనించిన మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆమె వద్దకు వెళ్లి మాట్లాడారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రూ.400కే వంటగ్యాస్ అందిస్తామని చెప్పారు. ఇందుకు మహిళ కృతజ్ఞతలు తెలిపి మాట్లాడారు. కర్ణాటకలో కాంగ్రెసోళ్లు చేస్తున్న పాలనతో ప్రజలు చీదరించుకుంటున్నామని, మా మద్దతు బీఆర్ఎస్కే ఉంటుందన్నారు.అనంతరం పట్టణంలోని 10వ వార్డు క్రిష్టయన్పల్లి, అయోధ్యనగర్, ఆదర్శనగర్, శ్రీరామకాలనీ, డబుల్బెడ్రూం కాలనీల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంత్రికి కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. క్రిష్టయన్పల్లి డబుల్ బెడ్రూం కాలనీలో మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా క్రిష్టయన్పల్లి డబుల్ బెడ్రూం కాలనీ వద్దకు వచ్చిన మంత్రి శ్రీనివాస్గౌడ్కు స్థానికుల నుంచి ఆత్మీయ పలకరింపు లభించింది. గూడు లేని తమకు డబుల్ బెడ్రూం ఇల్లు ఇచ్చారని, జీవితాంతం తోడుంటామన్నారు.
మహబూబ్నగర్, అక్టోబర్ 13 : మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీ, దుబ్బాక అసెంబ్లీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిపై జరిగిన హత్యయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. నీచ రాజకీయాలు చేస్తున్న ప్రతిపక్షాల వైఖరిని ప్రజలు గమనించాలని కోరారు.
మహబూబ్నగర్ అర్బన్, అక్టోబర్ 30 : మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ సోమవారం జిల్లా కేంద్రంలో మంత్రి శ్రీనివాస్గౌడ్తో మర్యాదపూర్వకంగా భే టీ అయ్యారు. ఈ సందర్భంగా మారుతున్న మహబూబ్నగర్ ముఖచిత్రం పేరిట నియోజకవర్గ అభివృద్ధిపై రచించిన పుస్తకాన్ని ఎర్రశేఖర్కు మంత్రి అందజేశారు. నియోజకవర్గాన్ని ఊహించని విధంగా అభివృద్ధి చేసిన మంత్రి శ్రీనివాస్గౌడ్ ఈ ఎన్నికల్లో లక్ష మెజర్టీ ఖాయమని ఎర్రశేఖర్ స్పష్టం చేశారు.