మహబూబ్నగర్, నవంబర్ 26 : మీరు ఏ న మ్మకం పెట్టుకొని బీఆర్ఎస్లోకి వస్తున్నారో వంద కు వంద శాంతం మీ నమ్మకం రెట్టింపు అయ్యేలా శాయశక్తులుగా కృషి చేస్తానని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వార్డు నెం బర్ 43కి చెందిన మైనార్టీ నాయకులు సుమారు 30 మంది బీఆర్ఎస్లో శరత్రెడ్డి ఆధ్వర్యంలో చేరారు. కౌన్సిలర్ ఖాజాపాషా ఆధ్వర్యంలో పట్ట ణ మొబైల్ అసోసియేషన్ సభ్యులు సుమారు 50 మంది బీఆర్ఎస్లో చేరారు. హన్వాడ మండలం టంకర గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు బొ క్కల రాజశేఖర్, కాంగ్రెస్ నాయకుడు పోకల రాజశేఖర్ బీఆర్ఎస్ పార్టీలో మంత్రి సమక్షంలో చేరా రు. పార్టీలోకి విచ్చేసిన వారికి మంత్రి గులాబీ కం డువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కోడూర్లో భీమయ్యగౌడ్ అనారోగ్యంతో మరణించడంతో అంత్యక్రియల్లో మంత్రి శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు. వారి కుటుంబ సభ్యులను ఓదర్చాడం జరిగింది.
మదర్సే రెహమతుల్ ఉలూమ్ ఫౌండర్ మౌలానా హఫీజ్ చాంద్ పాషా సున్నతుల్ జమాత్ మత పెద్ద మౌలానా మహమ్మద్ జావిద్ మంత్రి శ్రీనివాస్గౌడ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరి ఆయనకు పూర్తిస్థాయిలో మద్దతు తెలియజేస్తామన్నారు. అభివృద్ధికి అందరం అండగా ఉంటే మరింత అభివృద్ధి జరుగుతుందని, భవిష్యత్తు తరాలకు మహబూబ్నగర్ను మంత్రి శ్రీనివాస్గౌడ్ సహకారంతో ఉన్నతంగా తీర్చిదిద్ది అందిద్దామని పార్టీలో చేరిన వారు సూచించారు.
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, నవంబర్ 26 : రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన ఎల్లప్పను మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆయన గృహానికి వెళ్లి పరామర్శించారు. ఎన్నికల వేళ ఓ వైపు ప్రచారం జరుగుతున్నా మంత్రి ప్రజలకు అండగా ఉంటున్నారు. తన నియోజకవర్గంలోని ప్రజల సంక్షమం కోసం ఆహర్నిషలు పాటుపడుతున్నారు. కాగ జిల్లా కేంద్రంలోని కోయనగర్కు చెందిన ఎల్లప్ప ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడాడు. విషయం తెలిసిన మంత్రి వెంటనే ఆయన ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ఆధేర్యపడొద్దని, త్వరగా కోలుకొవాలని మంత్రి అన్నారు.
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, నవంబర్ 26 : ఎన్నికలలో ఓటర్లు బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఎంబీ చర్చిలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక ప్రార్థనలు చేసి పాస్టర్లు ఆశీర్వాదం తీసుకున్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎంబీ చర్చిలో కైస్తవుల ప్రత్యేక ప్రార్థనకు మంత్రి హాజరయ్యారు. అక్కడ నుంచి న్యూ మోతినగర్లో ఉన్న మెథడిస్ట్ చర్చిలో క్రైస్తవులను కలిసి ఎన్నికలలో తమకు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు జాజీమొగ్గ నర్సింహులు, ప్రభాకర్, రవి ప్రకాశ్, ప్రసాద్, క్రైస్తవులు ఉన్నారు.