మహబూబ్నగర్ టౌన్, జూన్ 7 : కాళేశ్వరం తరహాలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి పాలమూరును సస్యశ్యామలం చేస్తామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం జిల్లా నీటిపారుదాల శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో నిర్వహించిన ‘సాగునీటి దినోత్సవానికి’ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు సాగునీటి సం గతి దేవుడెరుగు.. కనీసం తాగడానికి సై తం నీరు లేని పరిస్థితులు ఉండేవన్నారు. స్వరాష్ట్రంలో తక్కువ సమయంలోనే సీఎం కేసీఆర్ కృషి, పట్టుదలతో 70 ఏం డ్లుగా సాధించని అభివృద్ధి తొమ్మిదేండ్లలో సాధించి దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందన్నారు. యాసంగిలో దేశవ్యాప్తంగా 96లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, అందులో 56లక్షలు కేవలం తెలంగాణ నుంచి సాగు చేయడం సాధించిన ప్రగతికి నిదర్శనమన్నారు.
గతంలో ఇరిగేషన్ శాఖకు ఎలాంటి గుర్తింపు ఉండే ది కాదని, ప్ర స్తుతం అందరికన్నా అద్భుతంగా ఇరిగేషన్శాఖ పని చేస్తున్నదని కొనియాడారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథ కం పూర్తయితే పూర్తిస్థాయిలో పాలమూ రు సస్యశామలంగా రూపుదిద్దుకుంటుందన్నారు. కోర్టు కేసుల వల్ల ప్రా జెక్టు పనులు ఆలస్యమయ్యాయని మం త్రి పేర్కొన్నారు. కర్వెన, ఉదండాపూర్ రిజర్వాయ ర్లు పూర్తయితే మహబూబ్నగ ర్ జిల్లా సశ్యశ్యామలమవుతుందని తెలిపారు. మహబూబ్నగర్ నియోజకవర్గంలో చేపట్టనున్న చెక్డ్యాంల నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలవాలని ఇంజినీరింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. అనంతరం ఉ త్తమ సేవలను అందించిన ఇంజినీర్లకు మంత్రి జ్ఞాపికలు అందించి సన్మానించారు. అంతకుముందు ఇరిగేషన్ శాఖ ప్రగ తి నివేదికను మంత్రి, అధికారులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా సాగునీటి ప్రాజెక్టుల చీఫ్ ఇంజినీర్ రమణారెడ్డి, అదనపు కలెక్టర్ సీతారామారావు, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మోసం చేసే పార్టీలను నమ్మొద్దు..
మహబూబ్నగర్ అర్బన్, జూన్ 7 : మాయమాటలు చెప్పే పార్టీలను నమ్మి ప్రజలు మోసపోవద్దని, అలాంటి వారికి తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జి ల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో బుధవారం దివిటిపల్లికి చెందిన కాంగ్రెస్ మైనార్టీ నాయకులు షేక్ యాకూబ్, సయ్యద్ ఇమ్రాన్ పాషాతో పాటు 100 మంది బీఆర్ఎస్ నాయకులు పాండురంగారెడ్డి, ముఖరంజ ఆధ్వర్యంలో మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
నేటి నుంచి ఫిష్ ఫుడ్ ఫెస్టివల్..
పాలమూరు, జూన్ 7 : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనెల 8,9,10 తేదీల్లో జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో నిర్వహించనున్న ఫిష్ ఫుడ్ ఫెస్టివల్కు సంబంధించిన పోస్టర్ను మంత్రి శ్రీనివాస్గౌడ్ క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.