మహబూబ్నగర్ అర్బన్, మార్చి 27 : బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని ఎ క్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. కార్యకర్తలను, వారి కుటుంబాలను కడుపులో పెట్టుకొని చూసుకుంటానన్నారు. భర్త చనిపోయి కుటుంబ పోషణ కష్టంగా మారిన బీఆర్ఎస్ మహిళా కార్యకర్త నిర్మల, క్యాన్సర్తో బాధపడుతున్న మరో కార్యకర్త శ్రీనివాస్ కుటుంబాలకు మంత్రి భరోసా కల్పించారు. మహబూబ్నగర్లోని పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో బాధితులు మంత్రి వద్దకు వెళ్లి మాట్లాడారు. ‘కొన్నేండ్ల కిందట ఉపాధి లేక వలసవెళ్లిన హన్వాడ మండలం గొల్లబండతండాకు చెందిన గోపాల్ అనారోగ్యంతో మృతి చెందాడు. ఇద్దరి పిల్లల చదువు, కుటుంబ పోషణ కష్టంగా మారింది’ అని గోపాల్ భార్య నిర్మల మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
బాధిత కుటుంబానికి అండగా ఉంటానని మంత్రి భరోసా కల్పించారు. బోయపల్లికి చెందిన శ్రీనివాస్ క్యాన్సర్తో బాధపడుతున్న విషయాన్ని అతడి భార్య, ఇద్దరు పిల్లలు మంత్రికి వివరించారు. ఇందుకు చలించిన మంత్రి.. ఇద్దరు పిల్లలను గురుకులంలో చేర్పించాలని, ఆమెకు ఏదైనా ఉద్యోగం కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం బాధిత కుటుంబసభ్యులతో కలిసి మంత్రి భోజనం చేశారు.