మహబూబ్నగర్ : జిల్లాలో సంఘ సంస్కర్త, భారతదేశ తొలి ఉపాధ్యాయుని, రచయిత్రి సావిత్రి బాయి ఫూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబ్నగర్ పట్టణ కేంద్రం తెలంగాణ చౌరస్తాలో అంబేద్కర్ జాతర ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని సావిత్రిబాయికి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం క్లాక్ టవర్ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన సావిత్రి బాయి విగ్రహాన్ని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావుతో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..బాలిక విద్య, నిరుపేదల అభివృద్ధి కోసం తన జీవితాన్ని దారపోసిన గొప్ప సంఘసంస్కర్త సావిత్రిబాయి పూలే అన్నారు. దేశానికి ఆమె చేసిన సేవలు వెలకట్టలేనివన్నారు.
కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేష్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.