మహబూబ్నగర్, నవంబర్ 28 : పాలమూరును అన్ని రంగాల్లో అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపానని, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం న్యూటౌన్ నుంచి క్లాక్టవర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ స్వయంగా బైక్ను నడిపి క్లాక్టవర్కు చేరుకుని కార్నర్ సమావేశంలో మాట్లాడారు.
కుట్ర చేసి రైతుబంధును ఆపి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీయేనన్నారు. ప్రతి పక్షాల కుట్రలను మహబూబ్నగర్ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. రౌడీ షీటర్లను వెనుక పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ వాళ్లు తిరుగుతున్నారని, కుల రాజకీయాలు చేస్తూ బీజేపీ నాయకులు తిరుగుతున్నారని తెలిపారు.