మహబూబ్నగర్ : మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇవాళ జిల్లాలో పర్యటించారు. పట్టణంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న మంత్రి ఓ వ్యక్తికి యాక్సిడెంట్ జరగడాన్ని చూసి వెంటనే చలించిపోయారు. ఏనుగొండ వద్ద జేజేఆర్ గార్డెన్ సమీపంలో మల్లేష్ అనే వ్యక్తి బైక్పై వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై.. అచేతనంగా పడి ఉన్నాడు.
అతడిని చూసిన మంత్రి వెంటనే కారు దిగి.. అతడికి మంచినీళ్లు అందించి వెంటనే ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించే సమయం అయినా కూడా ఆ వ్యక్తిని ఆసుపత్రిలో తరలించేదాకా అక్కడే ఉండి.. అతడిని స్వయంగా అంబులెన్స్ ఎక్కించి మంత్రి శ్రీనివాస్ గౌడ్ మానవత్వం చాటుకున్నారు.