హన్వాడ, మార్చి 3 : గ్యాస్ సిలిండర్ ధరలు పెంచిన మోదీ సర్కార్ దేశంలోని పేదలు, మధ్య తరగతి ప్రజలపై మోయలేని భారం వేసిందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ధ్వజమెత్తారు. గ్యాస్ ధరలు మహిళలను హడలెత్తిస్తున్నాయని వాపోయారు. సిలిండర్లపై వంటలు చేసే పరిస్థితి లేకుండా పోయిందని కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన గ్యాస్ ధరలకు నిరసనగా ఖాళీ సిలిండర్లతో శుక్రవారం హన్వాడ మండల కేంద్రంలో చేప ట్టిన ధర్నాలో మహిళలు, ప్రజలు, బీఆర్ఎస్ నాయకుల తో కలిసి మంత్రి పాల్గొన్నారు. కట్టెలపొయ్యి పెట్టి నిరసన తెలియజేస్తూ మోదీ సర్కార్ డౌన్.. డౌన్ అంటూ నినదిం చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిలిండర్ ధరలు పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తున్నదని దుయ్యబట్టారు. దేశంలోని పలు రాష్ర్టాల్లో ఎన్నికలు ముగిసిన వెంటనే గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచిందన్నారు. రెండు సార్లు అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో తెలియజేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత ఎనిమిది సార్లు గ్యాస్ ధరలను పెంచిందని చెప్పారు.
రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పెంచిన సిలిండర్ ధరలను తగ్గించకుంటే గ్రామగ్రామానా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పేదల అభివృద్ధిని మరిచి అదాని, అంబాని వంటి బడా వ్యాపారులకు పెద్ద పెద్ద పరిశ్రమలను అమ్మేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణకు ఆనుకొని ఉన్న బీజేపీ పాలిత రాష్ర్టాల్లో తెలంగాణ పథకాలు ఎందుకు అమలు కావడం లేదని ప్రశ్నించారు. అక్కడ రూ.2 వేల పింఛన్, రైతుబీమా, రైతుబంధు, నిరంతర విద్యుత్ను అక్కడి ప్రభుత్వాలు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. కేవలం కులం, మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టడమే బీజేపీ పనా అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత గ్రామాలు, పట్టణాల్లో ఎంత అభివృద్ధి జరిగిందో మీరే చూస్తున్నా రన్నారు. ప్రతి ఇంటికీ నల్లతో పాటు మిషన్ భగీరథ శుద్ధమైన నీటిని అందిస్తున్నామని తెలిపారు. పాలమూ రు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో ప్రతి చెరువును నీటితో నింపి మూడు పంటలు పుష్కలంగా పండించా లన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. కార్యక్ర మంలో ఎంపీపీ బాల్రాజ్, జెడ్పీటీసీ విజయనిర్మల, విండో చైర్మన్ వెంకటయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కరుణాకర్గౌడ్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ రాజుయాదమ్, ఎంపీటీసీలు సత్యమ్మ, వడ్ల శేఖర్, సర్పంచులు రేవతి, నాయకులు కొండ లక్ష్మయ్య, జంబులయ్య, కొండ బాలయ్య, బసిరెడ్డి, సత్యం, శ్రీనివాసులు, రాఘవులు, హరిచందర్, రామణారెడ్డి, సత్యం, చెన్నయ్య, యాదయ్య, జహంగీర్, శ్రీనివాసులు, ఆంజనేయులు, శివకుమార్, ఖాజాగౌడ్, ఆనంద్, ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళలు పాల్గొన్నారు.