తెలంగాణ ఏర్పడ్డాక విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేసినట్లు మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం మహబూబ్నగర్ రూరల్ మండలం కోటకదిర ఉన్నత పాఠశాలలో అక్షయపాత్ర సహకారంతో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి ప్రారంభించారు. అలాగే దేవరకద్ర, చిన్న చింతకుంట మండలాల్లో ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డితో కలిసి మంత్రి పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. కోయిల్సాగర్ ప్రాజెక్టులో 1.80 లక్షల చేపపిల్లలను విడుదల చేశారు.
పాలమూరు, సెప్టెంబర్ 23: తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చినట్లు ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. సర్కార్ బడుల్లో మౌలిక వసతుల కల్పన కోసం ‘మన ఊరు-మన బడి’ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు రూ.290 కోట్లు విడుదలైనట్లు చెప్పారు. శుక్రవారం మహబూబ్నగర్ రూరల్ మండలం కోటకదిర జెడ్పీ ఉన్నత పాఠశాలలో అక్షయపాత్ర సహకారంతో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి గురుకులాలు ఏర్పాటు చేస్తే మహబూబ్నగర్లోనే 20 ఉన్నాయన్నారు. పదో తరగతి వరకు వివిధ అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని, డిగ్రీ వరకు పర్యవేక్షిస్తే వారు ఏదో ఒక రంగంలో నిలదొక్కుకుంటారని తెలిపారు.
అక్షయపాత్ర నుంచి 47 పాఠశాలల్లో 4,947 మంది విద్యార్థులకు రుచికరమైన భోజనాన్ని అందిస్తున్నామన్నారు. పాలమూరు ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. మన్యంకొండ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఏసీ ఫంక్షన్హాల్ నిర్మాణంలో ఉన్నదని, రూ.15 కోట్లతో టూరిజం హోటల్ను త్వరలోనే నిర్మించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, ఎంపీపీ సుధాశ్రీ, జెడ్పీటీసీ వెంకటేశ్వరమ్మ, వైస్ ఎంపీపీ అనిత, సర్పంచ్ మల్లు రమ్య, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు దేవేందర్రెడ్డి, డీఈవో రవీందర్, అక్షయపాత్ర ఇన్చార్జి కృష్ణప్రసాద్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ మల్లు నర్సింహారెడ్డి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు నారాయణగౌడ్, ప్రధాన కార్యదర్శి రఘురాంరెడ్డి పాల్గొన్నారు.
విద్యార్థినికి మంత్రి గోరుముద్దలు
మన్యంకొండ చౌరస్తాలోని కోటకదిర జెడ్పీహెచ్ఎస్లో అక్షయపాత్ర సౌజన్యంతో మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి మంత్రి సహపంక్తి భోజనం చేశారు. 9వ తరగతి విద్యార్థిని శివానికి మంత్రి అప్యాయంగా గోరుముద్దలు తినిపించారు. భోజన పథకాన్ని ప్రారంభించిన మంత్రికి ఆమె కృతజ్ఞతలు తెలిపింది. నీవు బాగా చదువుకొని డాక్టర్ కావాలని, కష్టపడి చదివితే అండగా ఉంటామని మంత్రి పేర్కొన్నారు.
కుల వృత్తులకు సర్కార్ అండ
దేవరకద్ర రూరల్, సెప్టెబంర్ 23: కొత్తగా ఏర్పడే కౌకుంట్ల మండలాభివృద్ధికి కృషి చేస్తామని ఆబ్కారీ, క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. శుక్రవారం దేవరకద్ర, చిన్నచింతకుంట మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డితో కలిసి పర్యటించారు. దేవరకద్ర పట్టణంలో రూ.38లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించారు. కోయిల్సాగర్ ప్రాజెక్టులో లక్షా 80వేల చేపపిల్లలను వదిలారు. అనంతరం డోకూర్ సమీపంలోని కేజీబీవీలో రూ.కోటీ35 లక్షలతో అదనపు తరగతి గదులు, చిన్నచింతకుంట మండలం ముచ్చింతల్ శివారులోని ఊకచెట్టు వాగులో రూ.9 కోట్ల 99 లక్షలతో నిర్మించిన చెక్డ్యాం, అప్పంపల్లి గ్రామంలో రూ.కోటీ98 లక్షలతో నిర్మించిన సబ్స్టేషన్, గ్రామంలో కురువ సంఘం కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం కౌకుంట్ల నూతన మండల కృతజ్ఞతా సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేను పూలమాలతో సన్మానించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు రూపొందించి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కులవృత్తుల అభివృద్ధికి ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. దేవరకద్ర నియోజకవర్గంలో 21 చెక్ డ్యాంమ్లు నిర్మించిన ఎమ్మెల్యే ఆలకు ప్రజలు రుణపడి ఉండాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ కొత్త మండల ఏర్పాటుకు కృషి చేసిన పరిసర గ్రామాల సర్పంచులకు ధన్యవాదాలు తెలుపారు. బీజేపీ నాయకులు మనుషుల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రజలే వారికి తగిన గుణపాఠం చెబుతారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీలు రమాదేవి, హర్షవర్ధన్రెడ్డి, జెడ్పీటీసీలు అన్నపూర్ణ, రాజేశ్వరి, సర్పంచ్ స్వప్నాకిషన్రావు, వైస్ఎంపీపీ సుజాత, తాసిల్దార్ జ్యోతి, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో శ్రీనివాస్రావు పాల్గొన్నారు.