అభివృద్ధికి పట్టం కట్టాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ కోరారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని సర్వేల్లోనూ బీఆర్ఎస్కే ఎక్కువ సీట్లు వస్తున్నాయన్నారు.
మహబూబ్నగర్టౌన్, నవంబర్ 25 : అభివృద్ధికి పట్టం కట్టాలని, కాంగ్రెస్కు ఓటేస్తే చీకటి రాజ్యమే అని మహబూబ్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి డాక్టర్ శ్రీ నివాస్గౌడ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో రోడ్ షో ద్వారా బీఆర్ఎస్ పార్టీ ప్రచారం నిర్వహించారు. వ న్టౌన్ చౌరస్తా నుంచి ప్రారంభమైన రోడ్షో అశోక్ టా కీస్చౌరస్తా, అంబేద్కర్చౌరస్తా, తెలంగాణ చౌరస్తా, ఎర్రసత్యం చౌరస్తా, డీఈవో చౌరస్తా, శెట్టికాంప్లెక్స్ చౌ రస్తా, న్యూటౌన్, మెట్టుగడ్డ, పద్మావతికాలనీ మీదుగా శ్రీనివాస్కాలనీ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది. ఓపెన్టాప్ వాహనంపై ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తూ.. చేసిన అభివృద్ధిని వివరిస్తూ మంత్రి ముందుకు సాగా రు. కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నాయకులు, కార్యకర్తలు దారి వెంట వెళ్తూ దుకాణాలు, వాణిజ్య సముదాయాలు, ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. రోడ్షోకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. శ్రీనివాసకాలనీ చౌరస్తాలో మంత్రి ప్రసంగించారు. చివరి రోజు వరకు అప్రమత్తంగా ఉండి పని చేయాలని సూచించారు. మహబూబ్నగర్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం. ఐటీ పార్కు, అమర్రాజా కంపెనీతో ఎంతో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశలు వస్తాయన్నారు. కొత్త కంపెనీలో ఉద్యోగాలు భర్తీ చేస్తాం.. ఇంక కంపెనీలు తెచ్చి యువత భవిష్యత్తు కోసం కృషి చేస్తాను. అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయమన్నారు. నేడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. మరో సారి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం కార్యకర్తలు, నాయకులతో కలిసి శ్రీనివాసకాలనీలో ఛాయ్తాగారు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి బీసీలు అంటే చిన్న చూపు అని మంత్రి డాక్టర్ వీ.శ్రీనివాస్గౌడ్ అన్నారు. శనివారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని గౌలి వీధి నుంచి పాన్చౌరస్తా వరకు ఇంటింటి ప్రచారం నిర్వహించి తెలంగాణ ప్రభుత్వం చేసిన పనులు, మహబూబ్నగర్లో జరిగిన అభివృద్ధిని వివరించారు. అనంతరం కార్నర్ మీటింగ్ ద్వారా మాట్లాడారు. పొరపాటున కాంగ్రెస్ పార్టీకి అవకాశం అందిస్తే.. అభివృద్ధి చెందుతున్న మహబూబ్నగర్ను ఆగం చేస్తారని మంత్రి ప్రజలకు వివరించారు. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు టూరిస్టుల మాదిరిగా వచ్చాయని ఎన్నికలు అయిపోగానే పెట్టాబేడా సర్దుకుని వెళ్లిపోతారని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి చంద్రశేఖర్, మున్సిపల్ మాజీ చైర్మన్ ముత్యాల ప్రకాశ్, ఎంఐఎం జిల్లా యువత అధ్యక్షుడు జాకీర్, కౌన్సిలర్ వేదవ్రత్, నాయకులు చిన్న, శంకర్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ముడా చైర్మన్ గంజివెంకన్న, డీసీసీబీ చైర్మన్ వెంకటయ్య, పి.చంద్రశేఖర్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్యాదవ్, బీఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు కృష్ణమోహన్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు శివరాజ్, కార్యదర్శి మున్సిపల్ వైస్ చైర్మన్ తాటిగణేశ్, కౌన్సిలర్లు రామ్లక్ష్మణ్, షబ్బీర్, కట్టారవికిషన్రెడ్డి, పటేల్ప్రవీణ్, మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ రామలింగం, నాయకులు ఇక్బాల్, సమాద్ఖాన్, వాహెద్తా జ్, వినయ్, డాక్టర్ అహ్మద్, శ్రీనివాస్రెడ్డి, హన్మంతు, బాబుల్రెడ్డి, శ్రీను, శేఖర్, రాజశేఖర్, ఇమ్రాన్, సుల్తాన్, శాంతిభూషణ్, నరేందర్ పాల్గొన్నారు.