పెద్దమందడి, జూలై 29 : గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. మండలంలోని గట్లఖానాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న నాగులకుంటతండాకు చెందిన 20 కుటుంబాల సభ్యులు శనివారం హైదరాబాద్లో మంత్రి నిరంజన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తండాలను ప్రత్యేక గ్రామపంచాయతీలుగా మార్చి.. ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేశామన్నారు.
పా ర్టీలో చేరిన వారు మాట్లాడుతూ ఎన్నో ఏండ్ల నుంచి కలగా మిగిలిపోయిన బీటీ రో డ్డును మంత్రి నిరంజన్రెడ్డి నెరవేర్చారన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులమై బీఆర్ఎస్లో చేరామన్నారు. పార్టీలో చేరిన వారిలో కృష్ణ, తిరుపతి, రవి, మన్నెం, గోపాల్, శ్రీనివాస్, రమేశ్, శంకర్, శ్రీను తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో గట్లఖానాపూర్ సర్పంచ్ వెంకటేశ్, బీఆర్ఎస్ నాయకులు హనుమంతు, శివ, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.