వనపర్తి / రూరల్, సెప్టెంబర్ 10 : తెలంగాణ కోసం ఆచార్య జయశంకర్ జీవితాంతం పాటుపడ్డారని, ఆయన ఆశయ సాధన కోసం కేసీఆర్ ఎంతో కృ షి చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విశ్వకర్మల ఆత్మీయ సమ్మేళనానికి మం త్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధిపై రూపొందించిన డ్యాకుమెంటరీ ప్రదర్శనను విశ్వకర్మలు తిలకించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పరిధిలో జయశంకర్ రాక్గార్డు పార్కును ఏర్పా టు చేశామని, త్వరలోనే మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. పిల్లలకు తొట్టెల దగ్గర నుంచి మనిషి అంతిమ సంస్కారాలకు అవసరమైన వస్తువులను అందించేదుకు సహకరించేది విశ్వకర్మలన్నారు. అనంతరం విశ్వకర్మలు మంత్రిని గజమాలతో సన్మానించారు.
వీరనారి చాకలి ఐలమ్మ..
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ప్రణవశ్లోకకు అభినందన..
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద ఏదుల వద్ద నిర్మించిన పంప్హౌస్, రిజర్వాయర్ సందర్శన సమయంలో ప్రాజెక్టు గొప్పతనాన్ని పాలమూరు వెనుకబాటును మీడియాకు ప్రణవ శ్లోక అద్భుతంగా వివరించడం హర్షించదగ్గ విషయమని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని 33వ వార్డులో గల ప్రణవశ్లోక ఇంటికి వెళ్లి స్వీట్ తినిపించి అభినందించారు.
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ..
జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మూసాపేట మండలం మహమ్మద్ హుస్సేన్పల్లికి చెందిన ఐదుమందికి మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులను మంత్రి నిరంజన్రెడ్డి ఆదివారం పంపిణీ చేశారు.
బీఆర్ఎస్లో చేరికలు..
రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, పనిచేసే ప్రభుత్వానికి చేయూతను ఇవ్వాలని మంత్రి నిరంజన్రెడ్డి కోరారు. ఆదివా రం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా కేంద్రంలోని 5వ వార్డు నుంచి వివిధ పార్టీల నాయకులు 150 మంది, పెబ్బేరు మున్సిపాలిటీ నుంచి గుండ్రాతి నిఖిల్ గౌడ్ ఆధ్వర్యంలో 200 మంది యువకులు, శ్రీరంగాపూర్ మండలం తాటిపాముల, గోపాల్పేట మండలం చాకల్పల్లి గ్రామం నుంచి 150 మంది వేర్వురుగా మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
హ్యాట్రిక్ ఖాయం..
రాష్ట్రంలో బీఆర్ఎస్కు హ్యాట్రిక్ విజయం ఖాయమని మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఆదివారం వనపర్తి మండల నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు. కార్యక్రమాల్లో కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, వనపర్తి రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ సభ్యుడు రమేశ్, నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త వంగూరు ప్రమోద్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాణిక్యం, యువజన సంఘం అధ్యక్షుడు చిట్యాల రాము, కార్యదర్శి సంపత్కుమార్, కౌ న్సిలర్ అలేఖ్య తిరుమల్, మహేశ్, నా యకులు హేమంత్, ఏసేపు, రత్నయ్య, శేషయ్య, నాగయ్య, దుర్గ య్య, విశ్మకర్మ సంఘం సభ్యులు గోవర్ధనాచారి, శ్యాం సుందరాచారి, గోపినాథ్, మోనప్ప, అని ల్, వెంకటేశ్వరాచారి పాల్గొన్నారు.