వనపర్తి, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ) : సైబర్ నేరగాళ్ల మోసాలకు అడ్డూ అదు పు లేకుండా పోతున్నది. డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో తన పేరు తో కొందరు సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. తన పేరు మీద వాట్సాప్ మెసేజ్లు పంపుతూ సెల్ నెంబర్ 9353849489 నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగు లు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు వీటికి స్పందించవద్దని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు పంపొద్దన్నారు. సైబర్ నేరగాళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.