బీజింగ్ : చైనాలోని భారత రాయబార కార్యాలయంలో ఆదివారం ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. రాయబారి దొరైస్వామి ఆధ్వర్యంలో చైనాలోని భారతీయుల సమస్యలపై చర్చించారు. చైనా సోషల్ మీడియాలో పెరుగుతున్న యాంటీ ఇండియా ప్రచారంపై భారత రాయబార కార్యాలయం ఆందోళన వ్యక్తంచేసింది. అక్కడికు వచ్చిన భారతీయులు నిపుణులకు ఉద్యోగ వీసాలు తగ్గించడం, జీవిత భాగస్వాములకు ఉద్యోగాలపై పరిమితులు, కాన్సులర్ సేవలకు సంబంధించిన సమస్యలను తెలియజేశారు.
దొరైస్వామి మాట్లాడుతూ.. యాంటీ ఇండియా కంటెంట్పై చైనా ఆందోళన వ్యక్తం చేస్తున్నదని.. అరికట్టేందుకు చర్యలు తీసుకుంటోందని చెప్పారు. వీసాల కేటాయింపులో పరిమితులు లేకుండా చైనా తో చర్చలు జరుపుతున్నట్టు వెల్లడించా రు. భారతీయ సంస్కృతి, వంటకాలను చైనా ప్రజలకు తెలియజేసేందుకు కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు.