వనపర్తి, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ) : ఎన్నికలొస్తున్నాయంటే చాలు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి.. ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి చేరికలు కనిపించేవి. కానీ ఈసారి రెండు నెలలుగా వరుస చేరికలు ఒకే పార్టీలోకి కొనసాగుతున్నాయి. అయితే ఇందుకు కారణాలు లేకపోలేదు. ఇక్కడి ప్రజల జీవన పరిస్థితులను అవగాహన చేసుకొని వారికి అండగా నిలబడి మెరుగైన జీవన ప్రమాణాలకు పునాదులు వేస్తున్న చరిత్ర కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. పదేళ్లకు ముందు గత పాలకుల హయాం లో మొక్కబడిగా అభివృద్ధి సాగింది. ప్రజలు శాశ్వతంగా.. ప్రశాంతంగా బతికే వనరులపై దృష్టి నిలపలేదు. అలుపెరగని పోరాటంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ హయాం లో జనరంజక పాలన అందింది. బీఆర్ఎస్ ప్రభు త్వం అనుసరిస్తున్న విధానాలు, అభివృద్ధి, సంక్షే మ పథకాలకు పలువురు నాయకులు ఆకర్షితులవుతున్నారు. తొలి ఉద్యమ రోజు నుంచి రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, ముఖ్యమంత్రి సహకారంతో చేస్తున్న అభివృద్ధితో భవిష్యత్కు బంగారు బాటలు వేస్తున్నారు. వీటన్నింటినీ గమనించిన యువత గులాబీ గూటికి చేరుతున్నారు.
వనపర్తి నియోజకవర్గం సాగునీటి వనరులను పుష్కలంగా అందుకుంటున్నది. బీఆర్ఎస్ ప్రభు త్వం ప్రధానంగా సాగునీటి వనరులపైనే దృష్టి నిలిపింది. సాగునీరు వనరుల కల్పనలతోనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్న నమ్మకంతో ప్రాధాన్యతనిచ్చింది. రాత్రి, పగలనక కేఎల్ఐ కాలువల పనుల వెంట బస చేస్తూ నదుల నీటిని వనపర్తికి తరుముకొచ్చినట్లుగా చేసి నియోజకవర్గంలో మంత్రి నిరంజన్రెడ్డి లక్షా 25 వేల ఎకరాలకు సాగునీరు పారించి చరిత్ర సృష్టించారు. ఓడినా.. గెలిచినా.. నియోజకవర్గంలోనే ఉంటూ అన్ని రకాలుగా అభివృద్ధికి బాటలు వేశారు. గతం లో వనపర్తికి ఎమ్మెల్యేలుగా 15 దఫాల్లో ఇతరులే ఎన్నికవుతూ వచ్చారు. కేవలం ఒక్కసారి మాత్ర మే బీఆర్ఎస్ అభ్యర్థిగా నిరంజన్రెడ్డి హయాంలో ఎంతో అభివృద్ధి జరిగింది.
అక్టోబర్ నెల మొత్తంగా బీఆర్ఎస్లో చేరికలకే అన్నట్లు కనిస్తుంది. వరుస చేరికలతో గులాబీ పార్టీ జోష్ మీదున్నది. యువకులు, రైతులు, మహిళలు స్వచ్ఛందంగా తరలివస్తూ గులాబీ కండువాలు కప్పుకొంటున్నారు. మున్సిపాలిటీలోని వార్డుల నుంచి కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఆకర్షితులవుతున్నారు. ఇతర పార్టీల అలజడి లేకపోవడంతో కేవలం ఒకేపార్టీ అన్న చందంగా కారు దూసుకెళ్తున్నది. ఇటు చేరికల్లోనూ.. అటు ప్రచారంలోనూ బీఆర్ఎస్దే పైచేయిగా కనిపిస్తున్నది.
ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల ఖరారుపై సందిగ్ధం నెలకొన్నది. గ్రూపు తగాదాలతో కాంగ్రెస్, బీజేపీ కొట్టుమాట్టాడుతున్నాయి. రావుల చంద్రశేఖర్రెడ్డి, నాగం తిరుపతిరెడ్డితోపాటు పలువురు నా యకులంతా చేరడంతో బీఆర్ఎస్లో జోరు కొనసాగుతున్నది. పెద్ద నాయకుల నుంచి సాధారణ కార్యకర్త వరకు చేరికల ప్రభావం కనిపిస్తున్నది.
బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమానికి ప్రజలు జై కొడుతున్నారు. ఇప్పటికే పలు గ్రామా లు, తండాలు స్వచ్ఛందంగా గులాబీ పార్టీకి మద్దతు తెలిపారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కే మా ఓటు అంటూ ప్రకటిస్తున్నాయి. ప్రధానంగా తండాలు ఎక్కువగా మొగ్గు చూపుతూ ఏకగ్రీవ తీర్మాణాలు ప్రకటిస్తున్నాయి. కాగా గతంలోనూ బీఆర్ఎస్ గూటికి వలసల పర్వం కొనసాగుతూనే వస్తున్నది.
గతంలో రాజకీయ పార్టీలోకి నాయకులు ఎత్తుగడలు వేసి తీసుకొస్తే తప్పా కార్యకర్తలు, యువకులు వచ్చే వారు కాదు. కానీ ఇప్పుడా ఆ పరిస్థితి లేదు. బీఆర్ఎస్ చేస్తున్న మంచి పనులు చూసి ప్రజలు, యువకుల తీరు కొత్త ఆలోచనలకు తెరలేపుతున్నది. ఎలాంటి డిమాండ్లు లేకుండానే పార్టీలోకి స్వచ్ఛందంగా చేరుతున్నారు. దీంతో పా ర్టీశ్రేణుల్లో నూతన జోష్ నింపుతున్నది. విద్యార్థి సంఘాలు సైతం మొగ్గు చూపుతుండడంతో గులాబీ జెండాను మెడలో వేసుకుంటున్నది. గతంలో యువత విద్యార్థి సంఘాల బాటలోనే నడిచేవి. కానీ నేడు కొత్త ఆలోచనలు మొదలైనట్లు కనిపిస్తున్నది. ఇందుకు కారణం సీఎం కేసీఆర్, వనపర్తిలో మంత్రి నిరంజన్రెడ్డి అని చెప్పొచ్చు.