వనపర్తి, సెప్టెంబర్ 21 : స్వరాష్ట్ర పాలనలో అన్ని రంగాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని, తెలంగాణలో ప్రతి గడపకూ సంక్షేమం అందడంతోపాటు ప్రతి గ్రామంలో అభివృద్ధి జరుగుతుందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలోని పలు మండలాలు, గ్రామాలు, పట్టణాలకు చెందిన 384మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, 106మంది బాధితులకు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ 42.50 లక్షల విలువ గల చెక్కులను వేర్వేరుగా పంపిణీ చేశారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి మంత్రి సహపంక్తి భోజనం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని, సమాంతరంగా సంక్షే మం, అభివృద్ధి జరుగుతుందని మంత్రి వివరించారు. కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, అమ్మ ఒడి, న్యూట్రిషన్ కిట్, ఆసరా పింఛన్లలో దేశానికి ఆదర్శంగా నిలిచిందని మం త్రి గుర్తు చేశారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు మన ఊరు-మన బడి కార్యక్రమంతోపాటు గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయడంతో విద్యారంగ స్వరూపం మొత్తం మారిపోయిందన్నారు. కేసీఆర్ కిట్, నూతన వైద్యకళాశాలతో వైద్యరంగంలో మార్పులు వ చ్చాయని, తెలంగాణ దవాఖానలు కాన్పుల్లో రికార్డులు సృష్టిస్తున్నాయన్నారు. ఆపన్నులకు అండగా నిలిచేందుకు సీఎం సహాయనిధిని ప్రవేశపెట్టి పేద, మధ్య తరగతి వర్గాలకు సర్కారు సాయంతో ఊరట కలుగుతుందని మంత్రి వివరించారు. అందుకే పనిచేసే ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలిచి మరోసారి సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
వనపర్తి జిల్లా కేంద్రంలో మిషన్ భగీరథ ఇంటర్ లిం క్స్ పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. 29న జిల్లా కేంద్రానికి పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ వస్తున్న నేపథ్యంలో గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్తో కలిసి సంబంధించిన అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో జా ప్యం ఉండొద్దన్నారు. మిషన్ భగీరథ నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండొద్దని అధికారులకు సూ చించారు. బుగ్గపల్లితండా నుంచి మిషన్ భగీరథ ప్లాం ట్ వరకు రహదారి నిర్మాణం వెంటనే పూర్తి కావాలని, జిల్లా కేంద్రానికి మంజూరైన రూ.15 కోట్లతో రహదారులను వెంటనే చేపట్టాలని ఆదేశించారు. అనంతరం వివిధ అభివృద్ధి పనులపై చర్చించారు. సమావేశంలో జెడ్పీ చైర్మన్ లోక్నాథ్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్చైర్మన్ శ్రీధర్, జిల్లా అధికారులు ఉన్నారు.