కోస్గి, నవంబర్ 8 : కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న రేవంత్రెడ్డి అసలు నియోజకవర్గంపై కనీస అవగాహన లేకుండా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా ప్రజలు ఫైర్ అవుతున్నారు. 2018లో బీఆర్ఏస్ అభ్యర్థి పట్నం నరేందర్రెడ్డి చేతిలో రేవంత్రెడ్డి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసేందుకు సోమవారం కొడంగల్లో రేవంత్రెడ్డి నామినేషన్ వేసేందుకు వచ్చి మాట్లాడిన మాటలు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారాయి. దౌల్తాబాద్ మండలంలో జూనియర్ కళాశాల ఏర్పాటు కాలేదని చెప్పడం, దౌల్తాబాద్లో జూనియర్ కాలేజీ ప్రాంభమైన ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి కొడంగల్లో అసలు ఏం జరుగుతుందో కూఆ రేవంత్కు తెలియదని ఎద్దేవా చేస్తున్నారు. మహబూబ్నగర్- చించోలి నేషనల్ హైవే పనులు పూర్తికాలేదని, కొడంగల్ అభివృద్ధి చెందలేదని, కృష్ణా-వికారాబాద్ రైల్వే లైన్ రాలేదని, నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే రోడ్లు వేశానని ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేయడంతో బాహాటంగా ప్రజలు మింగుడుపడడం లేదు.
నామినేషన్ వేసి వెళ్లిపోతానని, కార్యకర్తలే గెలిపించాలని చెప్పడం, ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకుంటారనే అపవాదు, ఓటుకు నోటు కేసు, ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం వంటి అంశాలన్నీ రేవంత్రెడ్డికి వ్యతిరేకంగానే ఉన్నాయి. అయినప్పటికీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ కాంగ్రెస్ గెలుస్తుందని చెబుతున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే నియోజకవర్గం అభివృద్ధి చెందుతున్నదని, బీఆర్ఎస్ను కాదని కల్లోల కాంగ్రెస్ను నమ్మితే నట్టేట మునగడం ఖాయమని చెబుతున్నారు. 2018 ఎన్నికల్లో రేవంత్రెడ్డిపై పట్నం నరేందర్రెడ్డి 10వేల ఓట్ల మెజార్టీతో గెలుపొంది ఐదేండ్లు ప్రజల్లోనే ఉంటూ వారికి కావాల్సిన అభివృద్ధి చేసి చూపించారు. మద్దూర్ మండలంలో కొంతమంది సర్పంచులను డబ్బులిచ్చి కొనుగొలు చేసినా గ్రామప్రజలంతా నరేందర్రెడ్డి వైపే ఉంటామని చెప్పడంతో కాంగ్రెస్కు షాక్ తగిలింది. కాంగ్రెస్లో స్థానికంగా బలమైన నాయకత్వం లేకపోవడం, గుర్నాథ్రెడ్డిని ప్రజలు నమ్మకపోవడం వంటి అంశాలతో బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్రెడ్డికి కలిసొచ్చింది. దీనికి తోడు మంత్రి మహేందర్రెడ్డి ఇన్చార్జిగా వ్యవహరించడం, మంత్రి కేటీఆర్, హరీశ్రావు, సీఎం కేసీఆర్ నిర్వహంచే ప్రచారంతో నరేందర్రెడ్డి గెలుపునకు సహకారంగా మారనున్నాయి.
కొడంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్రెడ్డి గురువారం నామినేషన్ వేయనుండగా ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ రానున్నారు. దీంతో బీఆర్ఎస్ క్యాడర్లో నూతనోత్సానం నెలకొంది. ఈ సందర్భంగా బైక్ ర్యాలీ, నామినేషన్కు భారీ సంఖ్యలో తరలివచ్చేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. కొడంగల్ నియోజకర్గానికి మంత్రి కేటీఆర్ వరాల జల్లు కురిపిస్తారని ఆకాంక్షిస్తున్నారు. కోస్గి రెవెన్యూ డివిజన్గా, మద్దూరును మున్సిపాలిటీగా, ఐటీ కంపెనీ వంటి హామీలను కోరనున్నట్లు పట్నం నరేందర్రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా బీఆర్ఏస్ గెలుపు ఖాయమని ఎమ్మెల్యే తెలిపారు.