గండీడ్, నవంబర్ 11 : పరిగి నియోజకవర్గం కుల్కచర్లలో ఈ నెల 13వ తేదీన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రోడ్ షోను విజయవంతం చేయాలని గండీడ్ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు పెంట్యానాయక్ తెలిపారు. ఉమ్మడి మండలం నుంచి ప్రజాప్రతినిధులు, నాయకులు, కా ర్యకర్తలు, అభిమానులు అధి క సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమానికి పరిగి ఎ మ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ అభ్య ర్థి కొప్పుల మహేశ్రెడ్డితోపా టు పలువురు సీనియర్ నాయకులు హాజరవుతున్నారని తెలిపారు. ఉమ్మడి గండీడ్, మహ్మదాబాద్ మండలాల నుంచి తరలిరావాలని పిలుపునిచ్చారు.