అచ్చంపేట, మే 29 : ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మం త్రి తన్నీరు హరీశ్రావు మంగళవారం అచ్చంపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. దాదాపు రూ.50కోట్లతో మన్ననూర్, అచ్చంపేటలో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవా లు, శంకుస్థాపనలు చేయనున్నారు. మంత్రి పర్యటన ఏర్పాట్లను సోమవారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పరిశీలించారు. అచ్చంపేటలో వందపడకల దవాఖాన ప్రారంభం, డబుల్బెడ్రూం ఇండ్లు, బహిరంగసభ వేదిక ఏర్పాట్లను చూశారు. మంత్రి హరీశ్రావు సోమవారం రాత్రి శ్రీశైలంలో బసచేసి మంగళవారం తెల్లవారుజామున స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం రోడ్డుమార్గాన అమ్రబాద్ మండలం మన్ననూర్కు చేరుకుంటారు.
అక్కడ మధ్యాహ్నభోజనం అనంతరం ఆలయ నిర్మాణం, సీసీరోడ్డు, బస్టాండ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మంత్రి సమక్షంలో పలు పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరనున్నారు. అక్కడి నుంచి అచ్చంపేటకు చేరుకొని రూ.20కోట్లతో నిర్మించిన వందపడకల దవాఖాన భవనాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం మున్సిపల్ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన, మున్సిపల్ ప్రగతి నివేదిక కరదీపికను ఆవిష్కరించనున్నారు. అలాగే మ ల్లంకుంట-చౌటపల్లి రోడ్డులో విద్యుత్ సబ్స్టేషన్, 150డబుల్బెడ్రూం ఇండ్లు, సీసీరోడ్లు, ఎన్టీఆర్ స్టేడియం, ఇండోర్ స్టేడియం పనులను ప్రారంభించనున్నారు. సాయంత్రం 4గంటలకు నిర్వహించనున్న బహిరంగసభలో పా ల్గొననున్నట్లు విప్ గువ్వల తెలిపారు.
అచ్చంపేట, మే 29: అచ్చంపేట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసి తీరుతామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. అచ్చంపేట క్యాంపు కార్యాలయంలో సోమవారం ప్రభు త్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎత్తయిన ప్రాంతానికి సాగునీరు ఇవ్వడం సాధ్యపడదని గత పాలకులు వదిలేస్తే.. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రత్యేక చొరవతో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.2,300కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రాజెక్టుల పనులను ప్రారంభించి అచ్చంపేట, అమ్రాబాద్, బల్మూర్, లింగా ల, పదర మండలాల్లో ప్రతి గుంటకూ సాగునీరందిస్తామన్నారు. రూ.2,300కోట్ల విలువైన ప్రాజెక్టులు రావ డం ఇక్కడి ప్రజల అదృష్ణమన్నారు. నియోజకవర్గంలో 2లక్షల ఎకరాల వ్యవసాయభూమి ఉండగా, అందులో 60వేల ఎకరాలకు ఎంజీకేఎల్ఐ నీళ్లు అందుతుండగా, మిగిలిన పొలాలకు కొత్త ప్రాజెక్టులతో సాగునీటిని అందిస్తామన్నారు.
జూన్ 6న నాగర్కర్నూల్ కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ వస్తున్నారని, ఈ సందర్భంగా నిర్వహించే సభకు అచ్చంపేట ప్రాంతం నుంచి పెద్దసంఖ్యలో ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు మాట్లాడుతూ ప్రతిపక్షాలు స్వార్థ రాజకీయాల కోసం రైతులను ఆగం చేయవద్దని, ప్రాజెక్టుల నిర్మాణాలకు అడ్డుపడొద్దని విజ్ఞప్తి చేశా రు. రైతుల కోసం కలిసిరావాలని పిలుపునిచ్చారు. చిల్లర రాజకీయాలకు స్వస్తి పలికి మంచి పనికి సహకారం అందించాలన్నారు. రైతులను రెచ్చగొట్టి ప్రాజెక్టులను అ డ్డుకుంటామంటే సహించేదిలేదని హెచ్చరించారు. అవసరమైతే రైతులు, అచ్చంపేట బాగుకోసం తాను ఎమ్మె ల్యే పదవిని కూడా త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. సమావేశంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు మనోహర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అరు ణ, మున్సిపల్ చైర్మన్ నర్సింహాగౌడ్, మాజీ చైర్మన్ తులసీరాం, జెడ్పీటీసీలు ప్రతాప్రెడ్డి, మంత్రియా, రాంబా బు, లోక్యానాయక్, రాజేశ్వర్రెడ్డి, రమేశ్, విష్ణువర్ధన్రె డ్డి, ప్రవీణ్, శ్రీను, చెన్నకేశవులు, సతీశ్, రాజు ఉన్నారు.