‘సంక్షేమ పథకాలు కావాలంటే మళ్లీ కేసీఆరే సీఎం కావాలి.. కాంగ్రెస్ కు ఓటేస్తే ఆగమైతం.. మూ డు గంటల కరెంట్తో రైతులు ముప్పు తిప్పలు పడాల్సి వస్తది..’ అని మంత్రి హరీశ్రావు అన్నారు. మంగళవారం నారాయణపేట జిల్లా మద్దూర్ మండలంలో నిర్వహించిన రోడ్ షోలో మంత్రి హరీశ్రా వు పాల్గొని మాట్లాడారు. కొడంగల్లో రేవంత్రెడ్డి గుడి కట్టలేదు.. బడి కట్టలేదు.. ఎలా గెలుస్తారని ప్రశ్నించారు. కొడంగల్ను అభివృద్ధి చేసిన నరేందర్రెడ్డికి ఓటు వేసి గెలిపిస్తే సముచిత స్థానం కల్పిస్తామని, మద్దూర్ను మున్సిపాలిటీ చేస్తామని హామీ ఇచ్చారు. దౌల్తాబాద్ మండల ప్రాంతంలో ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు, నియోజకవర్గంలో డివిజన్ కేంద్రం ఏర్పాటు అవుతుందన్నారు. లీడర్లను కొనొచ్చుగానీ కొడంగల్ బిడ్డల ఆత్మగౌరవాన్ని కొనలేవని రైవంత్రెడ్డికి సవాల్ విసిరారు. రైతుబంధు ఖతం కావాలా ? కాంగ్రెస్ ఖతం కావాలా ? ఆలోచించాలని ప్రజలకు సూచించారు. రేవంత్ కొడంగల్కా నై.. కామారెడ్డికా నై.. రెండో సారీ పరాభవం తప్పదు.. అని హెచ్చరించారు.
కొడంగల్/మద్దూర్, నవంబర్ 28 : సంక్షేమ పథకాలను నిరంతరాయంగా కొనసాగాలంటే కేసీఆరే సీఎం కావాలని, కాంగ్రెస్కు ఓటేస్తే ఆగమైతమని మంత్రి హరీశ్రావు అన్నారు. బుధవారం నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూర్లో నిర్వహించిన రోడ్ షోలో మంత్రి పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ సీఎం అయ్యాకే సాధించుకున్న తెలంగాణలో సంక్షేమం, అభివృద్ధి జాతర కొనసాగుతుందన్నారు. కోట్లాది నిధులతో తెలంగాణ అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే ఆగమేనని, 50 ఏండ్ల పాలనే అందుకు నిదర్శనమన్నారు. పదేండ్లు కొడంగల్ ఎమ్మెల్యేగా రేవంత్రెడ్డి ఉండి గుడి కట్టలేదు.. బడి కట్టలేదన్నారు. కాంగ్రెస్కు అభ్యర్థులే లేరని, రేవంత్ ఏవిధంగా సీఎం అవుతాడని ప్రశ్నించారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతుబంధు ఖతం, విద్యార్థుల స్కాలర్షిప్లు ఖతం చేశారన్నారు. రేవంత్రెడ్డి వ్యవసాయానికి 3గంటల కరెంటు సరిపోతుందన్నాడని, నిజంగా సరిపోతుందా అని ప్రశ్నించారు. ఎవుసం తెలువని రేవంత్ కాబట్టే మూర్ఖంగా మాట్లాడుతున్నాడన్నారు.
ఉండగా ప్రస్తుతం 3, 4గంటలు మాత్రమే సరఫరా అవుతున్నదన్నారు. దాంతో కన్నడ ప్రజలు కాంగ్రెస్ను ఎందుకు గెలిపించుకున్నామా అని బాధపడుతున్నట్లు వివరించారు. కేసీఆర్ వచ్చాకే తండాలు జీపీలుగా మారాయని స్పష్టం చేశారు. 24గంటల కరెంటు, ఇంటింటికీ కృష్ణాజలాలు, కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, రైతుబంధు, రైతుబీమాతో తెలంగాణ అన్నపూర్ణ రాష్ట్రంగా అవతరించిందన్నారు. కాంగ్రెస్ నాయకులకు క్లారిటీ లేదని, అధికారం కోసం నోటికొచ్చిన వాగ్ధానాలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్కు ఓటేస్తే పదేండ్లు వెనక్కి వెళ్తామన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల కాల్వ పనులతో కొడంగల్లో లక్షా49వేల ఎకరాలకు సాగునీరందే సమయం దగ్గర్లోనే ఉందన్నారు. కాంగ్రెస్ను తప్పించి అభివృద్ధిని సాధించుకుందామని పిలుపునిచ్చారు. పట్నం నరేందర్రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే మద్దూర్ను మున్సిపాలిటీగా మార్చి రోడ్డు వెడల్పుతోపాటు స్ట్రీట్ లైట్లతో సుందరీకరిస్తామని హామీ ఇచ్చారు. స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కల్పించేలా దౌల్తాబాద్ ప్రాంతంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు, నియోజకవర్గంలో డివిజన్ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. బీఆర్ఎస్ను గెలిపిస్తే సీఎం కేసీఆర్ కాళ్లు పట్టుకునైనా సరే కొడంగల్కు ప్రమోషన్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. కేసీఆర్ అంటే నమ్మకం.. విశ్వాసంగా పేర్కొంటూ కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కాంగ్రెస్కు ఓటేసి అభివృద్ధిని అడ్డుకోవద్దని సూచించారు.
హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ చరిత్ర సృష్టిస్తారని మంత్రి పట్నం మహేందర్రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే పట్నం ఐదేండ్లుగా ప్రజల మధ్య ఉంటూ కొడంగల్ అభివృద్ధికి పాటుపడినట్లు తెలిపారు. అందువల్లే ఏ గ్రామానికి వెళ్లినా ఎమ్మెల్యేకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు.
గడిచిన ఐదేండ్లలో కొడంగల్ అభివృద్ధికి రూ.2వేల కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు. అభ్యర్థి అందుబాటులో లేక నేడు కాంగ్రెస్ నాయకులు ఫొటోను చూపి ఓట్లు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్కు ప్రజల్లోకి వెళ్లే దమ్ము ధైర్యం లేక నాయకులతో ప్రచారం చేయిస్తున్నట్లు తెలిపారు. గతంలో గెలిచి హైదరాబాద్కు పరిమితమై భూ కబ్జాలు, బ్లాక్మెయిల్ దండాలతో కోట్లు గడించి, నేటి ఎన్నికల్లో ప్రజా నాయకులను కొనుగోలు చేసి గెలవాలనే కుట్రలు పన్నుతున్నట్లు ఆరోపించారు. రేవంత్రెడ్డిపై పోటీ చేసేందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అవసరం లేదని, దమ్ముంటే తనపై గెలవాలని సవాల్ విసిరారు. డిసెంబర్ 30తో కాంగ్రెస్ ఎన్నికల జాతర ముగుస్తుందని, రేవంత్ హైదరాబాద్కు పరిమితం కావడం ఖాయమని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ టికెట్లను రూ.10కోట్ల నుంచి రూ.50కోట్ల వరకు అమ్ముకోవడం వల్ల కాంగ్రెస్ నాయకులు రేవంత్రెడ్డికి రేటెంతరెడ్డి అని పేరు పెట్టారన్నారు. మరోసారి ఆశీర్వదిస్తే.. ఐదేండ్లు ప్రజలకు అందుబాటులో ఉండి, సేవకుడిలా పని చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ డైరెక్టర్ సలీం, మాజీ జెడ్పీటీసీ బాల్సింగ్, కోస్గి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వీరారెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ జగదీశ్వర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సీ.వెంకటయ్య, సర్పంచ్ అరుణతోపాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.