నాగర్కర్నూల్టౌన్, జనవరి 16 : కంటి చూపుతో బాధపడుతున్న ప్రతిఒక్కరూ కంటివెలుగులో పరీక్షలు చేయించుకునే విధంగా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సూచించారు. సోమవారం కంటి వెలుగు కార్యక్రమ సన్నద్ధతపై ఖమ్మం జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వైద్యాధికారులతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెల 18న సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారని, ఆ రోజు రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు అందరూ ఖమ్మం లో ఉంటారని అందుకని మిగిలిన 32 జిల్లాల్లో 19వ తేదీ ఉదయం 9గంటలను అన్ని బృందాల ద్వారా ప్రారంభించుకోవాలని మార్పు సూచించారు. ప్రారంభ రోజుల్లో చాలా మంది కంటి పరీక్షలు చేయించుకోవడానికి వస్తారని, అలా కాకుండా రోజుకు 120 నుంచి 130 మంది ని రప్పించుకొని పరీక్షలు చేసే విధం గా చూసుకోవాలన్నారు. జనాలు ఎక్కువై సమ స్య తలెత్తకుండా పోలీస్ శాఖ వారు ఒకరిద్దరు సిబ్బందిని ప్రతి సెంటర్లో విధులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను ఆదేశించారు.
15లక్షల దగ్గరి చూపు అద్దాలు ఇప్పటికే జిల్లాలకు పంపించామని, దగ్గరి చూపు సమస్య ఉన్న వారికి అక్కడే కంటి అద్దాలు ఇచ్చి పంపించాలని సూచించారు. వీసీలో పాల్గొన్న రాష్ట్ర ప్రధా న కార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటివెలుగు కార్యక్రమ సన్నద్ధత విషయంలో తగు ముందస్తు జాగ్రత్తలు తీ సుకొని 19వ తేదీన జిల్లాల్లో ప్రారంభించుకోడానికి సిద్ధంగా ఉండాలన్నారు. జిల్లా నుంచి కలెక్టర్ ఉదయ్కుమార్ మాట్లాడు తూ కంటివెలుగు షెడ్యూల్ మారిన ప్రకా రం జిల్లాలో జనవరి 19న ఉదయం 9గంటలకు జిల్లాలో 50చోట్ల ఏకకాలంలో కంటి వైద్య శిబిరాలు ప్రారంభించేందుకు అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
ఇప్పటికే జిల్లాకు అవసరమైన కంటి వైద్య బృందాలను ఏర్పాటు చేశామని, వైద్య శిబిరాలకు అవసరమైన యం త్రాలు కంటి చూపు అద్దాలు అన్ని చేరుకున్నాయన్నారు. శిబిరాల ఏర్పాటుకు కావాల్సిన స్థలం, మౌలిక సదుపాయాలు, టేబు ళ్లు, టెంట్, మంచినీటి సౌకర్యం, తదితర అన్ని ఏర్పా ట్లు సిద్ధం చేసుకున్నట్లు వెల్లడించారు. మొదటి వారంరోజులు వైద్య శిబిరాలు నిర్వహించే గ్రామా లు, మున్సిపల్ వార్డుల్లో కంటే సమస్య ఉన్న వాళ్లను సమీకరించేందుకు పకడ్బందీగా ప్రణాళికలు చేశామని తెలిపారు. ఏమైనా సమస్యలు ఉంటే కంట్రోల్ రూంనెంబర్ 08540-230201 కు ఫోన్ చేసి ఫిర్యాదులు చేయొచ్చని పేర్కొన్నారు.
వీసీ లో డీజీపీ అంజనికుమార్, ఆరోగ్య శాఖ ప్రి న్సిపల్ సెక్రటరీ రీజ్వి, హెల్త్ కమిషనర్ శ్వేతామొహంతి, జిల్లా నుంచి ఎస్పీ మనోహర్, అదనపు కలెక్టర్ మనూచౌదరి, డీఎంహెచ్వో సుధాకర్లాల్, డీపీవో కృష్ణ, మున్సిపల్ కమిషనర్ జయంత్కుమార్రెడ్డితోపా టు తదితరులు ఉన్నారు.