వనపర్తి రూరల్, జూలై 26: ఒకానొక సమయంలో దేశంలో ఏ నిర్మాణ పనుల వద్ద చూసినా ఉమ్మడి జిల్లా కార్మికులే కనిపించేవారు. కానీ తెలంగాణ సిద్ధించాక సీఎం కేసీఆర్ పుణ్యమా అని సాగు, తాగునీటికి ఢోకా లేకుండా పోయింది. దీంతో తొమ్మిదేండ్లల్లోనే పాలమూరు పచ్చబడింది. దీంతో వలసలు కాస్త వాపస్ వచ్చి వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు.
ఈక్రమంలో ప్రతి గ్రామంలో కూలీల కొరత ఏర్పడడంతో పక్క రాష్ర్టాలు, జిల్లాలకు చెందిన కూలీలు ఇక్కడికి వ చ్చి వరి నాట్లు వేస్తున్నారు. వనపర్తి మండలంలోని ప లు గ్రామాల్లో వరి నాట్లు వేయడానికి ఏ పీ, యూపీ నుంచి మగ, ఆడకూలీ లు వచ్చి వరి నాట్లు వేయడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో సీఎం కేసీఆర్ సుదీర్ఘ ఆలోచనతో రాష్ట్రం సుభిక్షంగా మారిందని ప్రజలు చర్చించుకుంటున్నారు.