దేవరకద్ర రూరల్, మార్చి 3 : ప్రధాని నరేంద్రమోదీ.. నిత్యావసర ధరలను తగ్గించలేకపోతే గద్దె దిగాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. గ్యాస్ ధరల పెంపు ను నిరసిస్తూ శుక్రవారం పెద్దఎత్తున ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించారు. ఖాళీ గ్యాస్ సిలిండర్లతో ర్యాలీ నిర్వహించడంతోపాటు కట్టెలపొయ్యిపై వంటావార్పు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. చిన్నచింతకుంటలో నిర్వహించిన ధర్నాలో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి పాల్గొని మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం అన్ని వస్తువుల ధరలను పెంచుతూ పేదోళ్లను ముంచుతున్నదని ధ్వజమెత్తారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కా ర్యక్రమంలో ఎంపీపీ హర్షవర్ధన్రెడ్డి, జెడ్పీటీసీ రాజేశ్వరి, బీఆర్ఎస్ మండల అధ్యక్షు డు కోటరాము పాల్గొన్నారు.
మోదీని ఇంటికి పంపిద్దాం
బాలానగర్, మార్చి 3 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పిల్లలు తాగే పాల నుంచి గ్యాస్, పెట్రోల్ వరకు ధరలను పెంచి పేద లు బతకకుండా చేస్తున్నదని, దేశాన్ని కాపాడాలం టే ప్రధాని మోదీని ఇంటికి పంపించాలని గిరిజన కార్పొరేషన్ చైర్మన్ వాల్యానాయక్ అన్నారు. గ్యాస్ ధరల పెంపును ని రసిస్తూ మండలకేంద్రంలో ధర్నా నిర్వహించారు. అంతకుముందు జాతీయరహదారిపై వంటావార్పు చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
పేదల బతుకు భారం
జడ్చర్లటౌన్, మార్చి 3 : మోదీ సర్కార్తో పేదల బతుకు భారంగా మారిందని జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య అన్నారు. గ్యాస్ సిలిండర్ ధరల పెంపును నిరసిస్తూ జడ్చర్ల తాసిల్దార్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య, ము న్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి , సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రణీల్చంద ర్ తదితరులు పాల్గొన్నారు.
అచ్చేదిన్ కాదు..సచ్చేదిన్
భూత్పూర్, మార్చి 3 : మోదీ ప్రభుత్వ తీరుతో పేదలకు అచ్చేదిన్ కాదు.. సచ్చేదిన్ దగ్గరవుతున్నాయని మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్ ధ్వజమెత్తారు. గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ భూత్పూర్ చౌరస్తాలో ధర్నా చేపట్టారు. అంతకుముందు ఖాళీ సిలిండర్లతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ కదిరె శేఖర్రెడ్డి, సింగిల్విండో చైర్మన్ అశోక్రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహాగౌడ్, వైస్ఎంపీపీ నరేశ్గౌడ్, మత్స్య సహకార జిల్లా ఇన్చార్జి మనెమోని సత్యనారాయణ, ముడా డైరెక్టర్లు చంద్రశేఖర్గౌడ్, సాయిలు, నాయకులు సత్తూర్ నారాయణగౌడ్, సత్యనారాయణ, కోఆప్షన్ సభ్యుడు అజీజ్, బో రింగ్ నర్సింహులు, గడ్డం రాములు, సురేశ్, ప్రేమ్, సుదర్శన్గౌడ్, గురు పాల్గొన్నారు.
గుణపాఠం తప్పదు
కోయిలకొండ, మార్చి 3 : పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచి పేదల నడ్డి వి రుస్తున్న ప్రధాని మోదీకి తగిన గుణపాఠం తప్పదని ఎంపీపీ శశికళ, జెడ్పీటీసీ విజయభాస్కర్రెడ్డి అన్నారు. గ్యాస్ ధర పెంపును నిరసిస్తూ మండలకేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డి మాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బి.కృష్ణయ్య గిరిధారి నాగయ్య, రాజవర్దన్రెడ్డి, భీంరెడ్డి, టీవీ ఖాజా, శ్రీనివాస్రెడ్డి, మల్లయ్య, రాంరెడ్డి, వెంకట్నాయక్, అయూబ్ఖాన్, నారాయణగౌడ్, నాగేశ్, నాజీం, లక్కీగౌడ్, మహమూద్ పాల్గొన్నారు.
అడ్డాకుల, మూసాపేట మండలాల్లో..
మూసాపేట(అడ్డాకుల), మార్చి 3 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదలపై పె నుభారం మోపడాన్ని నిరసిస్తూ అడ్డాకుల, మూసాపేట మండలకేంద్రాల్లో బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. కట్టెల పొయ్యిపై వంటావార్పు చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ నల్లమద్ది రాజశేఖర్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోకల శ్రీనివాస్రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, సింగిల్విండో చైర్మన్ జితేందర్రెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు జయన్నగౌడ్, జె డ్పీ మాజీ కోఆప్షన్ సభ్యుడు మహమూద్, మూసాపేట ఎంపీపీ గూపని కళావతీకొండయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మీనర్సింహయాదవ్, రైతుబంధు సమితి అధ్యక్షుడు భాస్కర్గౌడ్, పల్లి శివరాములు, చం ద్రశేఖర్, సాయిరెడ్డి, స్వరూప, అనిల్కుమార్రెడ్డి, నర్సింహులుగౌడ్, రాజేందర్రెడ్డి, మశ్చేందర్నాథ్, ప్రకాశ్రెడ్డి పాల్గొన్నారు.
రాజాపూర్ మండలంలో..
రాజాపూర్, మార్చి 3 : వంటగ్యాస్ ధర పెంపును నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు మండలకేంద్రంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ సుశీల, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీశైలంయాదవ్ మా ట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధరలను భారీగా పెంచి పేదలపై పెనుభారం మోపుతున్నదని, పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కా ర్యక్రమంలో సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు బచ్చిరెడ్డి, రైతుబంధు సమితి అ ధ్యక్షుడు నర్సింహులు, ఏఎంసీ చైర్మన్ మల్లేశ్గౌడ్, తిరుపతయ్య, శ్రీశైలం, గోవింద్నాయక్, రమేశ్నాయక్, శ్రీనివాస్ ఉన్నారు.
గండీడ్ మండలంలో..
గండీడ్, మార్చి 3 : వంటగ్యాస్ ధర పెం పుపై బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. కేంద్రం తీరును నిరసిస్తూ మండలకేంద్రంలో ధర్నా నిర్వహించారు. కార్యక్రమం లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెంట్యానాయక్, వైస్ఎంపీపీ ఈశ్వరయ్యగౌడ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు గోపాల్, గోపాల్రెడ్డి, రాంచంద్రారెడ్డి, వెంకటయ్య, సాయిలు, రాంరెడ్డి, వెంకట్రెడ్డి, భగవంతుగౌడ్, మాణిక్యం, రమేశ్రెడ్డి, దశరథం, సాయిలు వెంకట్రాములు పాల్గొన్నారు.
మహ్మదాబాద్ మండలంలో..
మహ్మదాబాద్, మార్చి 3 : వంటగ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ మండలకేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. గ్యాస్ ధరలను భారీ గా పెంచి పేదోడి నడ్డి విరుస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భిక్షపతి, నాయకులు మామిళ్ల కేశవులు, సర్పంచ్ రాఘవేందర్, అతీక్, గోవర్ధన్రెడ్డి, రాజేశ్వర్, సత్యం, రాజుగౌడ్, నర్సింహులు పాల్గొన్నారు.
దేవరకద్ర మండలంలో..
దేవరకద్ర, మార్చి 3 : పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ మండలకేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ రమాశ్రీకాంత్యాదవ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జెట్టి నర్సింహారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలను భారీగా పెంచి పేదల ఉసురు పోసుకుంటున్నదని, మోదీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ అన్నపూర్ణ, ముడా డైరెక్టర్ కర్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.
మిడ్జిల్ మండలంలో..
మిడ్జిల్, మార్చి 3 : మోదీ ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలోని ప్ర ధానరహదారిపై బీఆర్ఎస్ నాయకులు ధ ర్నా నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ శశిరేఖ, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు జంగిరెడ్డి, ఎంపీటీసీ సుదర్శన్, బాలు, శ్యామల్రెడ్డి, బాలయ్య, వెంకట్రెడ్డి, నర్సింహారెడ్డి, గోపాల్రెడ్డి, నారాయణరెడ్డి, శ్రీనివాసులు, నవీనాచారి పాల్గొన్నారు.
నవాబ్పేట మండలంలో..
నవాబ్పేట, మార్చి 3 : వంటగ్యాస్ ధర పెంపును నిరసిస్తూ మండలకేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. కా ర్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాడెమోని నర్సింహులు, ఎంపీపీ అనంతయ్య, జెడ్పీటీసీ రవీందర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మయ్య, వైస్ఎంపీపీ సంతోష్రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షు డు మధుసూదన్రెడ్డి, ముడా డైరెక్టర్ చెన్న య్య, మాజీ జెడ్పీటీసీ ఇందిరాదేవి, మాజీ ఎంపీపీ శీనయ్య, సర్పంచులు గోపాల్గౌడ్, సత్యం, వెంకటేశ్, లక్ష్మారెడ్డి, యూత్వింగ్ అధ్యక్షుడు మెండె శ్రీను, కృష్ణయ్య, ప్రతాప్, అబ్దుల్లా, యాదయ్య, లక్ష్మి, నవనీతరావు, కృష్ణాగౌడ్, సంజీవరెడ్డి పాల్గొన్నారు.