అయిజ, ఏప్రిల్ 9 : ఆరుగాలం కష్టపడి పండించిన మొక్కజొన్న ధాన్యాన్ని విక్రయించేందుకు దళారీలను ఆశ్రయించొద్దని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు రైతులకు సూచించారు. గురువారం అయిజ పట్టణంలోని సబ్ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మున్సిపల్ చైర్మన్ సీఎం సురేశ్తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.
దళారులకు విక్రయించి రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోళ్లు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. కొనుగోళ్లు కేంద్రాల్లో సర్కారు నిర్ణయించిన రూ.2,400 మద్దతు ధర చెల్లిస్తుందన్నా రు. అలంపూర్ నియోజకవర్గంలో మొక్కజొన్న పండించిన రైతులు కొనుగోళ్లు కేంద్రాలను సద్వినియో గం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమం లో అలంపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డప్ప, వైస్ చైర్మన్ కుమార్, డీఏవో వీరప్ప, మార్క్ఫెడ్ ఎండీ చంద్రమౌళి, ఏడీఏ సక్రియానాయక్, ఏవో జనార్దన్, పీఏసీసీఎస్ కార్యదర్శి మల్లేశ్, కౌన్సిలర్లు, ఏఈవోలు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.