నమస్తే తెలంగాణ ఫొటోగ్రాఫర్, వనపర్తి జిల్లా : రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు వందశాతం సబ్సిడీతో చేపవిత్తనాలను పంపిణీ చేస్తున్నది. దీంతో చేపపిల్లలను ఏటా చెరువులో వదులుతున్నారు. గతేడాది వనపర్తి జిల్లా రాజపేట, సంకిరెడ్డిపల్లి గ్రామాల మధ్యలో ఉన్న చెరువులో మత్స్యకారులు చేపపిల్లలను వదిలారు.
రెండేండ్లుగా వదిలిన చేపపిల్లలు పెద్దగా కావడం చెరువులో నీళ్లు తగ్గడంతో మత్య్సకారులు శని, ఆదివారం చేపలుపట్టారు. దీంతో 3నుంచి 5కిలోల చేపలు చిక్కడంతో మత్య్సకారుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అదేవిధంగా మత్స్యకారులకు 100శాతం సబ్సిడీ ఇచ్చిన సీఎం కేసీఆర్కు, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మత్స్యకారులు చేపలు పడుతున్న దృశ్యాలను ‘నమస్తే తెలంగాణ’ కెమెరాలో బంధించింది.