సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలి
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
చారకొండ, ఏప్రిల్ 21 : సిరుసనగండ్ల సీతారామచంద్రస్వామి ఆలయాన్ని రాష్ట్రంలోనే గొప్ప పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. బుధవారం మండలంలోని సిరుసనగండ్ల సీతారామచంద్రస్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్యాదవ్తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సిరుసనగండ్ల ఆలమాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నదని చెప్పారు. అనంతరం కరోనా బారిన పడిన సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో జీబీఆర్ ట్రస్ట్ చైర్మన్ గువ్వల అమల, సర్పంచ్ యాతం శారద శ్రీను, విండో చైర్మన్ గురువయ్యగౌడ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు గజ్జెయాదయ్య, సర్పంచులు నరేశ్నాయక్, శ్రీను, నరేందర్రెడ్డి, సుజాత, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవీందర్, నాయకులు కమలాకర్రావు, కొండల్, సవారి జంగయ్య, ఆరెళ్ల పర్వతాలు పాల్గొన్నారు.