మహబూబ్నగర్, ఆగస్టు 7 : తాగడానికి కూడా నీరు దొరకని పరిస్థితి నుంచి అభవృద్ధి అంటే ఇది అని చూసే స్థాయికి మహబూబ్నగర్ ఎదిగింది. ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాంతంలో కరువు తప్ప మరేమీ లేదు.. పెట్టుబడులు పెట్టడం వృథా.. కేవలం రాజకీయాలు చేసుకోవడానికి పనికొస్తుందని భావించారు కొందరు నేతలు. నేడు అలాంటి వారంతా మహబూబ్నగర్కు వచ్చి చూస్తే తెలుస్తుంది పాలమూరు ప్రగతి. గడిచిన తొమ్మిదేండ్లల్లో పాలమూరు ఇమేజ్ హైదరాబాద్తో పోటీ పడుతున్నది.
శాయశక్తులా కృషి చేస్తున్న మంత్రి శ్రీనివాస్గౌడ్
ఎంత కాలం బతికామనేది కాకుండా.. బతికున్నంతలో ఏమి చేశాం.. మన వల్ల ఎంతమంది బాగుపడ్డారు అనే మాటను లక్ష్యంగా తీసుకున్న మంత్రి శ్రీనివాస్గౌడ్ రాత్రి, పగలు తేడా లేకుండా శ్రమిస్తున్నారు. మహబూబ్నగర్ బ్రాండ్ ఇమేజ్ను తక్కువ సమయంలోనే ఊహించనంత ఎత్తుకు తీసుకెళ్తున్నారు. శిల్పారామం, మినీ ట్యాంక్బండ్, ఐటీ పార్కు, మెడికల్ కళాశాల, బైపాస్, పట్టణ రోడ్డు విస్తరణ, ప్రధాన కూడళ్లలో ప్రత్యేక నిర్మాణాలు, ఇలా పలు కార్యక్రమాలతో పాలమూరులో ప్రగతి పరుగులు పెడుతున్నది. ఉమ్మడి జిల్లాతోపాటు వికారాబాద్, షాద్నగర్, ఏపీలోని కర్నూల్ జిల్లావాసులు సైతం మన వద్ద పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. మున్ముందు పట్టణ రూపురేఖలు మరింత మారి అభివృద్ధికి కేరాఫ్గా నిలుస్తుందనడంలో సందేహం లేదు.
సుస్థిరమైన వ్యాపారం..
కంచుకోట వ్యాపార సముదాయాలు మహబూబ్నగర్ వైపు చూస్తున్నా యి. ఇప్పటికే మంత్రి శ్రీనివాస్గౌడ్ పట్టుదలతో ఐటీ కారిడార్ ను 500 ఎకరాల్లో ఏర్పాటు చే శారు. ఈ ప్రాంతంలో రూ. 10వేల కోట్లతో 10వేలమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు క ల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పలు సంస్థలు ఇక్కడ తమ కంపెనీలను నెలకొల్పేందుకు పోటీపడుతున్నాయి. ప్యారడైస్ బిర్యానీ, చెన్నయ్, సీఎంఆర్ షాపింగ్మాల్స్, బిగ్ సీ, సంగీతా, వంటి బడా షోరూంలు ఇక్కడ కొలువయ్యాయి. పట్టణంలోని ప్రధాన చౌరస్తాల విస్తరణ, అభివృద్ధి సూచిక విగ్రహాలనుతోపాటు టీ కప్, మన పట్టణ ప్ర త్యేక శిఖరాన్ని ఏర్పాటు చేశారు. క్లాక్టవర్ను పునరుద్ధరించి అందరికీ ఆదర్శకంగా ఏర్పాటు చేశారు. వ్యాపార లావాదేవీలు సంతృప్తికరంగా ఉండడంతో మహబూబ్నగర్లో మరిన్ని పెద్ద కంపెనీలు తమ వ్యాపారాలు ఏర్పా టు చేసేందుకు సుముఖత చూపడం విశేషం.
అందరి చూపు.. పాలమూరు వైపు..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజల చూపు పాలమూరు వైపు పడుతున్నది. పెద్ద కంపెనీలు మహబూబ్నగర్కు వస్తుండడంతో కాసింత ఆశ్చర్యపోతున్నారు. రోజుకు రూ. లక్షల్లో జరిగే వ్యాపారాలు ఒకప్పుడు హైదరాబాద్కే పరిమితం కాగా నేడు పట్టణంలో చేస్తుండడంతో అవాక్కవుతున్నారు. షాపింగ్కు ఉమ్మడి జిల్లా వారంతా భాగ్యనగ రం తలుపులు తట్టేవారు. ఇప్పుడు ఇక్కడే పెద్ద పెద్ద షో రూంలు, హోటళ్లు, రెస్టారెంట్స్ ఏర్పాటవడంతో వ్యాపా రం మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరిస్తున్నది.
సంతోషించదగ్గ విషయం..
మహబూబ్నగర్కు పెద్ద పెద్ద షోరూంలు రావడం సంతోషించదగ్గ విషయం. తక్కువ సమయంలో ఇంటిల్లిపాది షాపింగ్ చేసుకునే అవకాశం లభించింది. హైదరాబాద్కే పరిమితమైన వస్త్ర దుకాణాలు పాలమూరులో ఏర్పాటు చేయడంతో ఇక్కడి వారికి కూడా ఉపాధి లభిస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎంతోమంది షాపింగ్కు మహబూబ్నగర్ పట్టణ తలుపులు తడుతున్నారు.
– రవి, మహబూబ్నగర్ పట్టణ వాసి
పట్టణం విస్తరిస్తోంది..
గతంలో మాదిరిగా కాకుండా మహబూబ్నగర్ పట్టణం విస్తరిస్తూ ఉన్నత స్థాయికి చేరుతోంది. అందరి సహకారంతో తక్కువ సమయంలోనే ఇంత అభివృద్ధి చేసుకున్నాం. మంత్రి శ్రీనివాస్గౌడ్ పట్టణ ప్రగతికి అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఈ అభివృద్ధిని నిరంతరం ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం. అన్ని రంగాల అభ్యున్నతే ధ్యేయంగా కృషి చేస్తున్నాం. ఇక్కడ స్థిర ఆస్తుల విలువ పెరుగుతోంది. భవిష్యత్తులో పాలమూరు ప్రగతి మరింత పెరుగుతుంది.
– రవినాయక్, కలెక్టర్, మహబూబ్నగర్