మరికల్, ఏప్రిల్ 8 : భూమిపై ఉన్న పీవోటీని తొలగించేందుకు నారాయణపేట జిల్లా మరికల్ రెవెన్యూ అధికారులు లంచం డిమాండ్ చేయగా.. సదరు మహిళ ఏసీబీ అధికారులను ఆశ్రయించగా.. అడ్డంగా దొరికిపోయిన ఘటన చోటు చేసుకున్నది. ఏసీబీ డీఎస్పీ ఫయా జ్, బాధితురాలు సంధ్యారాణి కథనం మేరకు.. మరికల్ మండలం రాకొండ గ్రామానికి చెందిన మదన్మోహన్రావు పేరు మీద గ్రామ శివారులో సర్వే నెంబర్ 222/1, 222/2, 222/3, 222/4లో 9.21 గుంట ల భూమి ఉన్నది. అయితే ఈ భూమిని సదరు యజమానికి తెలియకుండానే వేరే వ్యక్తుల పేరు మీద రెవె న్యూ అధికారులు రిజిస్టర్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న సదరు భూ యజమాని మదన్మోహన్రావు కూతురు సంధ్యారాణి ఐదేండ్ల కిందట కోర్టులో కేసు వే సింది. కేసు విచారణ సమయంలో సైతం ఆమె అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నది. 2021 మే 21న ఆమెకు అనుకూలంగా కోర్టు తీర్పు రాగా.. ఈ విషయా న్ని రెవెన్యూ అధికారులకు తెలియజేసి ఆ భూమిపై ఉన్న పీవోటీని తీసేయాలని విన్నవించింది. అయితే నాటి తాసిల్దార్ శ్రీధర్ రూ.10 లక్షలు డిమాండ్ చేశారని గతేడాది నవంబర్ 22న సీనియర్ అసిస్టెంట్ తా హేర్ సదరు మహిళకు తెలిపాడు. అంత మొత్తం డబ్బు ఇవ్వడం తన వల్ల కాదనడంతో ప్రక్రియ నిలిచిపోయింది. తర్వాత జనవరిలో సదరు తాసిల్దార్ ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే.. కాగా సీనియర్ అసిస్టెంట్ తాహేర్ గత నెల సదరు మహిళకు తిరిగి ఫోన్ చేశాడు. మీ పని చేస్తామని, అందుకు రూ.4 లక్ష లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీనికి ఆమె రూ. 3.50 ల క్షలు ఇస్తామనడంతో ఒప్పందం కుదిరింది.
గురువా రం డబ్బులు ఇవ్వాలని కోరగా.. కార్యాలయంలో అ యితే ఏసీబీ అధికారులు దాడులు చేసే అవకాశం ఉన్నదని, మహబూబ్నగర్లో తీసుకుంటామని తాహేర్ చె ప్పాడు. ఈ క్రమంలో రాత్రి 11గంటల సమయంలో మహబూబ్నగర్ వన్టౌన్ పోలీస్స్టేషన్ వద్ద డబ్బులు ఇస్తుండగా.. ఏసీబీ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. కేసు నమోదు చేసి డీటీ జగన్, సీనియర్ అసిస్టెంట్ తాహేర్ అలీని మహబూబ్నగర్ నుంచి మరికల్ తాసిల్దార్ కార్యాలయానికి తరలించి విచారించినట్లు ఏసీబీ డీఎస్పీ ఫయాజ్ తెలిపారు. అలాగే డీటీ జగన్ ఇంట్లో సోదాలు చేయగా రూ.లక్ష నగదు లభ్యమైనట్లు పేర్కొన్నారు. ఇద్దరిని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నా రు. దాడుల్లో ఏసీబీ అధికారులు నాగాచారి, శ్రీనివాస్, రేణుక, పురుషోత్తం పాల్గొన్నారు. ఈ జనవరి 19న మరికల్ తాసిల్దార్ లంచం తీసుకుంటూ పట్టుబడిన ఘ టన మరువకముందే మరో ఘటన చోటు చేసుకున్నది.