నారాయణపేట టౌన్, మే 13 : దళితబంధు మొదటి విడుత లబ్ధిదారులకు యూనిట్లను త్వరితగతిన పంపిణీ చేయాలని కలెక్టర్ హరిచందన అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో దళితబంధు పురోగతిపై ప్రత్యేక అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడుతగా 183 లబ్ధిదారులను తీసుకున్నట్లు చెప్పారు. అలసత్వం వహిస్తున్న అధికారులపై ఆగ్ర హం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్ ఈడీ హరినాథ్రెడ్డి, వ్యవసాయశాఖ అధికారి జాన్ సుధాకర్, డీఆర్డీవో గోపాల్నాయక్, ఎంపీడీవోలు తదితరు లు పాల్గొన్నారు.
భూగర్భ జలాలను వృద్ధి చేయాలి
రానున్న వర్షాకాలంలో పెద్దఎత్తున వాన నీటి సంరక్షణ పద్ధతులను పాటించాలని కలెక్టర్ హరిచందన సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా భూగర్భ జలవనరుల అంచనా నివేదికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూగర్భ జలాల అంచనాల ప్రకారం వినియోగం 43శాతంగా ఉందని, ధన్వాడ, కోస్గి, మరికల్ మండలాల్లో భూగర్భ జలాల వినియో గం ఎక్కువగా ఉందన్నారు. వర్షాకాలంలో ఎండిపోయిన బోరు బావులు, బావుల్లోకి వాన నీటిని పంపించి భూగర్భ జలాలను వృద్ధి చేయాలన్నా రు. పట్టణంలో ఇంకుడుగుంతలను తవ్వుకోవాలని ప్రజలకు సూచించారు. నీటి సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. కార్యక్రమంలో భూగర్భ జలశాఖ డీడీ రాజేందర్కుమార్, రవికుమార్, అసిస్టెంట్ హైడ్రోలియజిస్ట్ చైతన్యకుమార్ తదితరులు పాల్గొన్నారు.