వనపర్తి జిల్లాలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్న ది. ఈ ప్రాంతమంతా సస్యశ్యామలంగా మారింది. బుద్ధారం, ఖిల్లాఘణపురం, పెద్దమందడి బ్రాంచ్ కెనాల్, చెక్డ్యాంల నిర్మాణం, చెరువుల మరమ్మతులు చేపట్టడంతో అదనంగా 1.20 లక్షల ఎకరాలకు పైగా సాగులోకి వచ్చింది. ఏదుల రిజర్వాయ ర్, కర్నెతండా లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తయితే ఇంకా ఎ క్కువ భూమి సాగులోకి రానున్నది. తెలంగాణ ఏ ర్పడక ముందు 99,487 ఎకరాలు సాగుచేస్తుండ గా.. నేడు టీఆర్ఎస్ సర్కార్ హయాంలో 2,15, 601 ఎకరాల్లో పచ్చని పంటలు దర్శనమిస్తున్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశాలతో వ్యవసాయ శాఖ మg జిల్లాలో అడుగడుగునా సాగునీరు నీటి కోసం నోళ్లు తెరిచిన బీడు భూములు.. నీళ్లులేక ఎండిపోయిన బోరుబావులు..వర్షాధారంపై పండే పంటలు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు వనపర్తి జిల్లా పరిస్థితి.. కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ సాగునీటి రంగానికి పెద్దపీట వేయడంతో పెండింగ్ ప్రాజెక్టులన్నీ రన్నింగ్గా మారాయి.. కొత్త ప్రాజెక్టులు వచ్చాయి.. ఎత్తిపోతలతో అడుగడుగునా కృష్ణమ్మ జలతాండవం చేస్తున్నది. చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి. ఉమ్మడి పాలనలో 99,487 ఎకరాలు సాగులో ఉండగా.. నేడు 2.15 లక్షల ఎకరాల్లో సిరుల పంటలు పండుతున్నాయి. వ్యవసాయం పండుగలా జరుగుతుండడంతో రైతు కుటుంబాలు ఆర్థికంగా బలపడ్డాయి. ఇవేమీ తెలియని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అబద్ధాలు మాట్లాడుతూ రాజకీయం కోసం వాస్తవాలను కప్పిపెడుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
– వనపర్తి, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ)
బీజేపీ నాయకులు కబోదుల్లా వ్యవహరిస్తున్నారు. కండ్ల ముందే ప్రాజెక్టులు, పెరిగిన ఆయకట్టు కనబడుతున్నా.. రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారు. ఒకప్పుడు బీడు భూములకు, వలసలకు నిలయమైన పాలమూరు ప్రాంతం ఇప్పుడు స్వయం సమృద్ధి సాధిస్తుంటే ఓర్వలేక విమర్శలు చేస్తున్నారు. వాస్తవాలను కప్పిపెట్టి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన పాదయాత్రలో అవాస్తవాలను ప్రచారం చేస్తూ అభాసుపాలవుతున్నాడు. రిజర్వాయర్లు, లిఫ్ట్లు, కాలువలు, చెరువులు, కుంటల్లో కృష్ణమ్మ జలకళలు చూసి మాట్లాడాలని రైతులు, ప్రజలు సూచిస్తున్నారు. ఏమీ తెలియకుండా ప్రగల్భాలు పలకడం తగదని హెచ్చరిస్తున్నారు.
ంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఎన్నో లిఫ్ట్లు, కాలువలు ఏర్పాటు చేసి బీడు భూములను సాగులోకి తీ సుకొచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎటువంటి సహాయ సహకారాలు అందించకున్నా.. పా లమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు వడివడిగా చేపడుతున్నారు. జూరాల ప్రాజెక్టు ఎడ మ కాలువ కింద 69,084 ఆయకట్టు ఎకరాలు ఉండగా, మొత్తానికి సాగునీరందుతున్నది. రాజీవ్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్ కింద జూరాల ప్రాజెక్టు నుంచి 20 టీఎంసీలను వాడుకొని మహబూబ్నగర్, వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాల్లో 2.3 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక రూపాందించింది. భీమా ఫేజ్-2 కింద 74,3 97 ఎకరాల నిర్దేశిత ఆయకట్టు ఉండగా.., వనపర్తి జిల్లాలో 64,300 ఎకరాలకు స్థిరీకరించారు. ఎంజీకేఎల్ఐ కింద శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 40 టీఎంసీలు వాడుకొని మహబూబ్నగర్, వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాలో 4.5 ఎకరాలకు సాగునీరందిస్తున్నారు. వనపర్తి జిల్లాలో 64,739 ఎకరాలకు స్థి రీకరించారు. ఖిల్లాఘణపురం బ్రాంచ్ కెనాల్ కింద పనులు పురోగతిలో ఉండగా, ఇప్పటివరకు 33 కుంటలు, చెరువులు నింపారు. రూ.60.58 కోట్ల తో చేపట్టిన బుద్ధారం కుడి కాలువ పనులు పురోగతిలో ఉండగా, ఇప్పటివరకు 29 కుంటలు, చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. 10 చె క్డ్యాంలకు గానూ తెలంగాణ ప్రభుత్వం రూ.51 కోట్లు కేటాయించారు. కాగా, ఇప్పటివరకు రూ. 23.50 కోట్లతో ఆరింటిని పూర్తి చేశారు. మిగతావి పురోగతిలో ఉన్నాయి. మొత్తం పనులు పూర్తయితే 2,500 ఎకరాలకు సాగునీరందనున్నది. జిల్లాలో మొత్తం 1,254 చెరువులు, కుంటలు ఉండగా, వా టి కింద 66, 361.68 ఎకరాల ఆయకట్టు ఉన్నది. నేడు చెరువులు, కుంటలు నీటితో కళకళలాడు తున్నాయి. మిషన్ కాకతీయ కింద ఇప్పటివరకు రూ.124.40 కోట్లతో 944 చెరువులను పునరుద్ధరించారు.
మరిన్ని ప్రతిపాదనలు..
వనపర్తి నియోజకవర్గ పరిధిలో గొల్లప ల్లి రిజర్వాయర్, గణపసముద్రం, ఘణపు రం, ఎర్రగట్టు, బుద్ధారం స్టేజ్-1, స్టే జ్-2, కిష్టాపూర్ రిజర్వాయర్లకు త్వరలో ఆ మోదం రానున్నది. గతంలో పనులు చేపట్టిన రిజర్వాయర్ల నుంచి ప్రతి మండలం లో ఒక టీఎంసీని నిలువ ఉంచి స్థానిక అవసరా లకు వాడుకునే అవకాశం ఉన్న ది. వీటికి త్వరలో ఆమోదం లభించనున్న ది. ఎత్తైన ప్రాంతంలో ఉన్న కాశీంనగర్, కాశీంనగర్ తండా, దత్తాయిపల్లి, దత్తాయిపల్లి తండాలకు సాగు నీరందించేందుకు కిష్టాపూర్ రిజర్వాయర్ వద్ద మినీలిఫ్ట్ ఏర్పాటు చేసి దాదాపు 1,500 ఎకరాలకు సాగునీరు, గ్రామాలకు తాగునీరు అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
వరంలా ఎంజీకేఎల్ఐ
1984లో సమైక్య పాలకులు ఎంజీకేఎల్ఐ ప్రస్తావన తెచ్చినప్పటికీ.. 2004 వరకు సర్వేల పేరుతో కాలయాపన చేశారు. 2004లో జలయజ్ఞం పేరుతో 25 టీఎంసీలను కేటాయించి 2.50 లక్షల ఎకరాల ఆయకట్టుతో పనులను ప్రారంభించారు. అయితే, ఆయకట్టును అంచెలంచెలుగా పెంచుతూ 3.40 లక్షల ఎకరాల వరకు తీసుకెళ్లారు. కానీ, ఆయకట్టు పెరిగినా.. టీఎంసీల కేటాయింపులు పెంచాలన్న సోయి మాత్రం లేకుండాపోయింది. నాడు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడి హోదాలో ఉన్న నిరంజన్రెడ్డి ఈ లోపాన్ని గుర్తించి విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రభుత్వం చొరవ తీసుకొని ఆయకట్టుకు తగినట్లుగా 40 టీఎంసీలకు పెంచింది. అలాగే సుమారు రూ.105 కోట్లతో ఖిల్లాఘణపురం బ్రాంచ్ కెనాల్ను పూర్తి చేసి ఎంజీకేఎల్ఐ నుంచి సాగునీటిని అందిస్తున్నారు. దీంతో జిల్లాలో ఎటుచూసినా పచ్చని పొలాలే కనిపిస్తున్నాయి. జిల్లా రైతుల పాలిట ఎంజీకేఎల్ఐ వరంలా మారింది.
ఏడు టీఎంసీలతో ‘ఏదుల’
టీఆర్ఎస్ సర్కార్ హయాంలో జిల్లాలో సాగు, తాగునీటికి ఢోకా లేదు. వరుసగా కరువు కాటకాలు వచ్చినా నీటి కటకట ఉండొద్దనే ఉద్దేశంతో ప్రాజెక్టులు, కాలువలు, లిఫ్ట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఏడాది పొడవునా చెరువుల్లో నీరు ఉండేలా చర్యలు చేపట్టారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఏడు టీ ఎంసీల సామర్థ్యంతో ఏదుల రిజర్వాయర్ను నిర్మిస్తున్నారు. అక్కడక్కడా కొంచెం పనులు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా, రూ.76.19 కోట్లతో చేపట్టిన కర్నెతండా లిఫ్ట్కు ఇటీవల సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ ఎత్తిపోతల పనులు పూర్తయితే అనేక గిరిజన తండాలకు ప్రయోజనం కలగనున్నది. కర్నెతండా, పూల్సింగ్ తండా, హన్మ్యాతండా, చిన్నపీర్ తండా, ఆముదంబండ తండా, భీముని తండా, దొంతికుంట తండా, రుక్కన్నపల్లి తండా, పోతులకుంట తండా, జంగమాయపల్లి తండా, ఎర్రగడ్డ తండా, మేడిగడ్డతండా, గార్లబండ తండా, పెద్దమందడి, ఘణఫురం, వనపర్తి, బిజినేపల్లి మండలాల్లోని 8 గ్రామాలు, 15 తండాలకు సాగునీరందనున్నది.
తెలంగాణ వచ్చాకే సాగునీరు..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో పుష్కలంగా సాగునీరు అందుతున్నది. గతంలో పంటలు పండించుకుందామంటే నీరు ఉండేది కాదు. నిరంజన్రెడ్డి సార్ ప్రత్యేక దృష్టితో సీఎం కేసీఆర్ను ఒప్పించి నీళ్లు తెచ్చాడు. ఇప్పుడు సంబురంగా సాగు చేసుకుంటున్నాం. భూముల ధరలు పెరిగాయి. రైతుబంధు, ఉచిత విద్యు త్, సాగునీటితో మా దశ తిరిగింది. బీజేపీ నాయకులకు ఇవేమీ కనిపించడం లేదు. వారు ఏం చెప్పినా ప్రజలు, రైతులు నమ్మే పరిస్థితిలో లేరు.
– గోపాల్నాయక్, వెనకితండా, ఖిల్లాఘణపురం మండలం
పుష్కలంగా నీళ్లున్నాయి..
టీఆర్ఎస్ హయాంలో బీడు భూములు సాగుగా మారాయి. బుద్ధారం బ్రాంచ్కెనాల్ కింద పుష్కలంగా సాగునీరందుతున్నది. నాకున్న 12 ఎకరాల్లో పంటలు పండుతున్నాయి. భూమి ధర కూడా పెరిగింది. భూ ములు కొందామన్నా.. అమ్మడానికి ఎవ్వ రూ ఇష్టపడుతలేరు. ఇదంతా సీఎం కేసీఆర్ పుణ్యమే. జీవితాంతం రుణపడి ఉంటాం.
– కావలి కృష్ణయ్య, రైతు, బుద్ధారం