మహబూబ్నగర్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని బుధవారం పా ర్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. మంత్రు లు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి, ఎంపీలు మన్నె శ్రీనివాస్రెడ్డి, రాములు, విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆలవెంకటేశ్వర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, రాజేందర్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి, జైపాల్యాదవ్, ఆబ్రహం, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్రెడ్డి, ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి మందాజగన్నాథం, డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా, కార్పొరేషన్ చైర్మన్లు సాయిచంద్, ఇంతియాజ్ ఇసాక్, బండారి భాస్క ర్, నాయకుడు చల్లావెంకట్రామిరెడ్డి తదితరులు ఒకరోజు ముందుగానే ఢిల్లీకి చేరుకున్నారు. బీఆర్ఎస్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించగానే ఉమ్మడి జిల్లాలో సం బురాలు చేసుకున్నారు. ఆయా జిల్లా, మండల కేంద్రాలు, గ్రామాల్లో కార్యకర్తలు స్వీట్లు పంచిపెట్టారు. జై బీఆర్ఎస్.. జైజై బీఆర్ఎస్, కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.