టెన్షన్ వీడింది.. ఊహాగానాలకు తెర పడింది.. బీఆర్ఎస్ తొలి జాబితా వచ్చేసింది.. మళ్లీ సిట్టింగులకే సీఎం కేసీఆర్ టికెట్లు కేటాయించారు.. ఉత్కంఠ మధ్య లిస్టును విడుదల చేస్తూ గ్లోబల్ ప్రచారానికి ఫుల్స్టాప్ పెట్టారు.. సోమవారం తెలంగాణ భవన్లో 115 మంది జాబితాను అధికారికంగా విడుదల చేయగా.. ఉమ్మడి జిల్లాలోని 12 స్థానాలకుగానూ ప్రస్తుతమున్న ఇద్దరు మంత్రులు, 10 మంది ఎమ్మెల్యేలకు మళ్లీ అవకాశం కల్పించారు. వీరిలో ఇద్దరు బీసీలు, ఇద్దరు ఎస్సీలు ఉన్నారు. మిగతా పార్టీలకంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించి సమరశంఖాన్ని పూరించారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు, నాయకులు టీవీల్లోవీక్షించారు. గులాబీ పార్టీశ్రేణుల సంబురాలు అంబరాన్నంటాయి. బ్యాండ్, పటాకుల మోతలు హోరెత్తగా.. మిఠాయిలు పంచుకున్నారు. సీట్లు దక్కించుకున్న వారికి శ్రేణులు ఫోన్లు చేసి శుభాకాంక్షలు తెలియజేస్తూ అభిమానంతో ముంచెత్తారు. గత అసెంబ్లీ ఎన్నికల నాటి ఫలితాలు పునరావృతం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
మహబూబ్నగర్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గులాబీ పార్టీ అభ్యర్థులను మారుస్తున్నారని చేసిన గ్లోబల్ ప్రచారాన్ని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పటాపంచెలు చేస్తూ బీఆర్ఎస్ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా టికెట్లను ఖరారు చేశారు. ఉమ్మడి జిల్లాలో ఇద్దరు మంత్రులు, పది మంది ఎమ్మెల్యేలకు అవే స్థానాల్లో తిరిగి టికెట్ ఇస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితా ప్రకారం ఉమ్మడి జిల్లాలోని 12 స్థానాల్లో తిరిగి సిట్టింగ్లకే ప్రాధాన్యమిచ్చారు. అన్ని పార్టీలకంటే ముందే జాబితా విడుదల చేసి ఎన్నికల సమరానికి శంఖం పూరించారు. జాబితా విడుదల అవుతున్న నేపథ్య ంలో బీఆర్ఎస్ నేతలు టీవీలకు అతుక్కుపోయారు. తమ నేతలకు టికెట్లు మళ్లీ రావడంతో కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. స్వీట్లు పంచి పటా కులు కాల్చారు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు అభినందనలు తెలిపారు. గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేయడంతో బీజేపీ, కాం గ్రెస్ పార్టీలు షాక్కు గురయ్యాయి. సోషల్ మీ డియా, ఇతర మాద్యమాల్లో టికెట్లు రావని గ్లోబల్ ప్రచారం చేయగా, సిట్టింగ్లకు జై అనడంతో ఖంగుతిన్నారు. మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబగద్వాల జిల్లాలో క్యాడర్ ఫుల్జోష్లో ఉన్నారు. బీఆర్ఎస్ జాబితా విడుదల చేయడంతో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. ఎన్నికల వేడి రాజుకుంది. దమ్మున్న నేత కేసీఆర్ కాబట్టే అందరికంటే ముందుగానే అభ్యర్థుల జాబితా విడుదల చేశారని బీఆర్ఎస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ప్రత్యర్థులు ఎవరున్నారని చూడకుండా క్యాండెట్లను ప్రకటించి తనదైన ముద్ర వేశారన్నారు. తమపై నమ్మకం ఉంచి టికెట్లు ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజతలు తెలుపుతూ మరింత బాధ్యతగా పనిచేస్తామని వెల్లడించారు.
మహబూబ్నగర్ : వి.శ్రీనివాస్గౌడ్
వనపర్తి : సింగిరెడ్డి నిరంజన్రెడ్డి
అచ్చంపేట : గువ్వల బాలరాజు
మక్తల్ : చిట్టెం రామ్మోహన్రెడ్డి
నారాయణపేట : రాజేందర్రెడ్డి
దేవరకద్ర : ఆల వెంకటేశ్వర్ రెడ్డి
జడ్చర్ల : సి.లక్ష్మారెడ్డి
నాగర్కర్నూల్ : మర్రి జనార్దన్రెడ్డి
కల్వకుర్తి : జైపాల్యాదవ్
కొల్లాపూర్ : బీరం హర్షవర్ధన్రెడ్డి
గద్వాల : బండ్ల కృష్ణమోహన్రెడ్డి
అలంపూర్ : వీఎం అబ్రహం
ఉమ్మడి జిల్లాలో ఎన్నికల వేడి..
తొలి జాబితాలోనే ఉమ్మడి జిల్లాలోని అన్ని స్థానాలకు సిట్టింగ్లకు కేటాయించి బీఆర్ఎస్ రాజకీయ వేడిని రగిలించింది. అనుకున్నట్లే అన్ని పార్టీల కంటే ముందుగానే టికెట్లు ఇచ్చి కాంగ్రెస్, బీజేపీలకు సవాల్ విసిరింది. తెలంగాణ భవన్లో కేసీఆర్ జాబితా ప్రకటించగానే ఉమ్మడి జిల్లాలో ఒక్కసారిగా రాజకీయ వేడి రాజుకుంది. ఫలానా ఎమ్మెల్యేకు టికెట్ రాదని సోషల్మీడియాలో చేసిన చీప్ ట్రిక్లను పటాపంచలు చేస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిట్టింగ్లకే టికెట్లు ఖరారు చేసి రెండు పార్టీలకు ఝలక్ ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలో 12స్థానాలకు గానూ పన్నెండు మంది సిట్టింగ్లకు టికెట్లు ఖరారు చేశారు. ఇద్దరు బీసీలకు, ఇద్దరు దళిత సామాజిక వర్గాలకు కేటాయించగా, మిగతా స్థానాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న వారికే మొగ్గుచూపారు. ఆరునెలల ముందుగానే టికెట్లు ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ మోహం చాటేయగా, రెండు పార్టీల్లో టికెట్లు రానివాళ్లకు, అసంతృప్తులకు గాలం వేసేందుకు బీజేపీ నేతలు గుంటకాడి నక్కల్లా ఎదురు చూస్తున్నారు. ఈ రెండు పార్టీలు అభ్యర్థులను ప్రకటించడానికి వెనుకంజవేయడంతో ఆ పార్టీ క్యాడర్లో నిరాశ అలుముకుంది. బీఆర్ఎస్ జాబితా విడుదల కావడంతో తమకు టికెట్లు దక్కుతాయా? అనే అనుమానం మొదలైంది. ఇంకా జాబితా రావడానికి చాలా టైం పడుతుందని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా అయితే బీఆర్ఎస్ను ఏలా ఢీకొంటామని అంటున్నారు.
భారీ మెజార్టీ ఖాయమంటున్న క్యాడర్..
ఉమ్మడి జిల్లాలో మళ్లీ సిట్టింగ్లకే అవకాశం ఇవ్వడంతో 2018 ఎన్నికల సీన్ రిపీట్ అవుతుందని బీఆర్ఎస్ క్యాడర్ అంటుంది. తెలంగాణ వచ్చినంక ఏడు సీట్లు ఇచ్చిన పాలమూరు జిలా ్లతిరిగి ఐదేండ్లకు ఏకంగా 13 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించింది. అదికూడా ఆషామాషీ మెజార్టీతో కాదు రికార్డు స్థాయి మెజార్టీ ఇచ్చి గెలిపించడంతో విపక్షాలకు డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఈసారి కూడా అదే జోష్ కొనసాగిస్తామని క్యాడర్ అంటున్నది. ఈ తొమ్మిదేండ్లలో పాలమూరు జిలా ్లరుపురేఖలే మారిపోయాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు నియెజకవర్గాలను ఊహించని విధంగా అభివృద్ధి చేశారు. దీంతో నాలుగేండ్ల కిందట ప్రజలు బీఆర్ఎస్ను ఆదరించి భారీ మెజార్టీ ఇచ్చారు. ఈసారి అంతకుమించి అభివృద్ధి చేసి చూపించారు. అభివృద్ధిలో పోటీపడి మున్సిపాలిటీలు, మండలాలు తీసుకువచ్చి పరిపాలనను చేరువచేసి చూపించారు.
విపక్షాల గుండెల్లో గుబులు..
బీఆర్ఎస్ జాబితా విడుదల కావడంతో కాంగ్రెస్, బీజేపీల గుండెల్లో దడ మొదలైంది. తమ పార్టీలు ఎవరికి టికెట్లు వస్తాయోనన్న ఆందోళన కనిపిస్తున్న ది. పార్టీకి సేవ చేసిన వారికి కాదని.. అసంతృప్తులకు టికెట్లు ఇస్తే పార్టీని ఓడిస్తామని ఆ పార్టీల నేతలు బాహాటంగానే అంటున్నారు. ఇటీవల నాగర్కర్నూల్లో ఓ బీజేపీ నేత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలు భేషుగ్గా ఉన్నాయని మెచ్చుకున్నారు. బయట చెప్పకున్నా.. లోలోపల మాత్రం ఇదే అభిప్రాయంతోనే నేతలు ఉన్నారు. ఈసారి కూడా బీఆర్ఎస్ను ఢీకొనే క్యాండెట్లే లేరని ఆ పార్టీ సీనియర్ నేతలు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలే కొంపముంచుతాయని.. పార్టీ కోసం పనిచేసి ఏం లాభమని ఆ పార్టీ నేతలు బాహటంగా ప్రశ్నిస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ సమావేశంలో దేవరకద్రకు చెందిన ఓ నేత నాకు టికెట్ కావాలంటే ఎం త డబ్బులు పార్టీకి ఇవ్వాలో.. మీకేంతా ఇవ్వాలో చె ప్పండి.. డిపాజిట్ చేస్తా అని చెప్పడం ప్రకంపనలు సృష్టించింది.
పాలమూరు అంటేనే రేవంత్, జిత్తు, డీకేకు హడల్
ఒకప్పుడు పాలమూరులో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, అధికారం వెలగబెట్టిన బడా నేతలకు ఇప్పుడు జిల్లా ప్రజలు షాక్ ఇచ్చారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీల్లో హేమాహేమీ నేతలకు చు క్కలు చూపించారు. ఈసారి పాలమూరు జిల్లాలో పోటీ చేయాలంటేనే జంకే పరిస్థితి వచ్చింది. టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి సొంత జిల్లాలో పోటీకి జంకుతున్నారు. 2018లో ఘోర పరాజయం తర్వాత ఆయన జిల్లాకే రావడం మానేశారు. ఇక కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించి బీజేపీలోకి జంప్ అయి ఎంపీగా పోటీచేసిన డీకే అరుణకు ఈసారి ఎన్నికలు పరీక్షగా మారాయి. గద్వాలలో ఆమె ఓటమి ఖాయమని సొంత సర్వేలు చెబుతున్నాయి. ఇక ఎంపీగా పోటీ చేస్తే ఓటమి తప్పదని భావించి ఎటువెళ్లాలో తెలియక సతమతమవుతున్నారు. పార్టీని వెన్నుపోటు పొడిచి గత ఎంపీ ఎన్నికల్లో టికెట్ నిరాకరించడంతో బీజేపీలో చేరిన జితేందర్రెడ్డి రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది. ఈసారి కూడా ఎంపీ సీటు రాదనే భావనలో ఉన్నారు. 2023 ఎన్నికలు ఈ ముగ్గురు నేతల భవిష్యత్ను తేల్చనున్నాయి. ఈసారి ఓడిపోతే రాజకీయ సన్యాసమే అని విశ్లేషకులు భావిస్తున్నారు.
వనపర్తిలో ప్రగతి పరుగులు
వనపర్తిలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం. వ్యవసాయ రంగంలో అగ్రస్థానంలో నిలబెడుతాం. సీఎం కేసీఆర్ సహకారంతో జిల్లా ప్రగతిని కొనసాగించడానికి ప్రజలు మరోసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చేందుకు ఆశీర్వదించాలి. గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించడంతో మీరిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను. విద్య, వైద్యం, విద్యుత్, వ్యవసాయ, ఉపాధి రంగాల్లో జిల్లాను ముందుంచాను. లక్షలకుపైగా ఎకరాల్లో సాగునీరు పారించాను. దశాబ్దాలుగా వనపర్తి ప్రజల కల రోడ్ల విస్తరణ పూర్తి కావచ్చింది. ప్రతి గ్రామం, తండాలకు బీటీ రహదారులు తీసుకొచ్చాను. ప్రతి గ్రామంలో, వీధివీధినా సీసీ రోడ్లు వేయించాను. మిగిలిపోయిన సమస్యలు భవిష్యత్లో పరిష్కరిస్తాను.
– నిరంజన్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి
మరింత అభివృద్ధి చేస్తా
ఒకప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కరువు కాటకాలకు నిలయంగా ఉండేది. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ నేతృత్వంలో కేవలం తొమ్మిదిన్నర ఏండ్లల్లోనే ఊహించని అభివృద్ధి చేసి చూపించాం. అందుకే ప్రజలు గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో దీవించారు. మళ్లీ కేసీఆర్ నా మీద నమ్మకంతో ఈసారి ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు. దీంతో మరింత బాధ్యత పెరిగింది. పాలమూరు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తా. నియోజకవర్గంలో ప్రతి ఎకరాకూ సాగునీరు అందించి సస్యశ్యామలం చేస్తాం. భవిష్యత్తులో వేరే జిల్లాల వారు కూడా పాలమూరుకే వచ్చి బతికేటట్లు చేస్తాం. వ్యవసాయం, విద్య, వైద్య, పారిశ్రామిక పరంగా ప్రత్యేక గుర్తింపు ఉన్న నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా. పేదలను ధనవంతులు చేయడమే బీఆర్ఎస్ లక్ష్యం. టికెట్ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు..
– శ్రీనివాస్గౌడ్, ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి
అధినేతకు కృతజ్ఞతలు : మంత్రి శ్రీనివాస్గౌడ్
మహబూబ్నగర్ అర్బన్, ఆగస్టు 21 : మహబూబ్నగర్ బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా తన పేరును అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించడంపై మంత్రి శ్రీనివాస్గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మహబూబ్నగర్లోని తమ వ్యవసాయ క్షేత్రం వద్ద ఉన్న తల్లితండ్రులు శాంతమ్మ, నారాయణగౌడ్ సమాధుల వద్ద నివాళులర్పించారు. అనంతరం మంత్రికి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. డోలు వాయిస్తూ భారీ ర్యాలీ నిర్వహించి పటాకులు కాల్చి తమ ఆనందాలను వ్యక్తం చేశారు. మంత్రి మిఠాయిలు తినిపించి అభినందనలు తెలిపారు. దీంతో మంత్రి నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది.
‘సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపిన గువ్వల’
అచ్చంపేట, ఆగస్టు 21 : అచ్చంపేట అసెంబ్లీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మూడోసారి అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ను సోమవారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సాయంత్రం ప్రగతిభవన్లో సీఎంను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అచ్చంపేటలో గులా బీ జెండా ఎగురవేయాలని సీఎం కేసీఆర్ ఆశీర్వదించారు. త్వరలోనే అచ్చంపేట సాగునీటి ప్రాజెక్టులను ప్రారంభించుకుందామని సీఎం కేసీఆర్ తెలిపినట్లు గువ్వల తెలిపారు.
మరోసారి ఆశీర్వదించాలి..
అలంపూర్/ఉండవెల్లి, ఆగస్టు 21 : ప్రజలకు చేస్తున్న సేవను గుర్తించి గులాబీ బాస్, సీఎం కేసీఆర్ మరోసారి అవకాశం కల్పించారని ఎమ్మెల్యే అబ్రహం అన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే అనేక అభివృద్ధి పనులు చేపట్టామని, ప్రజలు మరోమారు ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేసి అలంపూర్ను ఆదర్శంగా నిలుపుతానని అన్నారు. అలంపూర్ అభ్యర్థిగా అబ్రహం ఖరారు కావడంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేను గజమాలతో సత్కరించారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి మెయిన్ రోడ్ వరకు సంబురాలు నిర్వహించారు. ఉండవెల్లి మండలంలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.
నమ్మకాన్ని నిలబెట్టుకుంటా..
గద్వాల, ఆగస్టు 21 : గద్వాల నియోజకవర్గం నుంచి మూడోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం కల్పించిన పార్టీ అధినేత, సీఎం కేసీఆర్కు ఎప్పటికీ రుణపడి ఉంటానని బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లకు నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నా.
హ్యాట్రిక్ పక్కా : ఎమ్మెల్యే మర్రి
నాగర్కర్నూల్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ) : రానున్న ఎన్నికల్లో మూడోసారి బీఆర్ఎస్ పార్టీ తరుపున నేను విజయం సాధించడం పక్కా. తె లంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఎన్నో అభివృద్ధి పథకాలతోపాటు నాగర్కర్నూల్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు తప్పకుండా గెలిపిస్తారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలను సీఎం కేసీఆర్ తెలంగాణలో ప్రవేశపెట్టారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారు. మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయం.
అభివృద్ధికి మరింత కృషి : ఎమ్మెల్యే బీరం
కొల్లాపూర్, ఆగస్టు 21 : తనపై నమ్మకం ఉంచి మరోసారి కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పించిన బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి సోమవారం ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. నా వెంట నడిచిన కార్యకర్తలు, నాయకులను కంటికి రెప్పలా కాపాడుకుంటానన్నారు.
జననం : 4 అక్టోబర్ 1958
తల్లిదండ్రులు : తారకమ్మ, రాంరెడ్డి
సంతానం : డాక్టర్ ప్రత్యూష, అమృత
వర్షణి, తేజస్విని
ప్రస్తుత పదవి : వ్యవసాయం, సహకారం,
మార్కెటింగ్ శాఖల మంత్రి
విద్యాభ్యాసం : బీఎస్సీ. ఎల్ఎల్బీ
రాజకీయ ప్రస్థానం : 1999-2000 ఏపీ ఖాదీ బోర్డు చైర్మన్ పనిచేశారు. 2001 నుంచి 2014 వరకు పొలిట్ బ్యూరో సభ్యుడు, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు, మేనిఫెస్టో కమిటీ సభ్యుడిగా, 2014 లో తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2018 డిసెంబర్లో వనపర్తి అసెంబ్లీ నుంచి చిన్నారెడ్డిపై 51,685 ఓట్లతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యా రు. ఫిబ్రవరి 2019లో వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మార్కెటింగ్, కో-ఆపరేషన్, ఆహారం, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల మంత్రిగా కొనసాగుతున్నారు.
జననం : 16 మార్చి 1969
తల్లిదండ్రులు : నారాయణగౌడ్, శాంతమ్మ
భార్య : శారద
కూతుళ్లు : శ్రీహిత, శ్రీహర్షిత
విద్యార్హత : బీఎస్సీ, పీజీడీసీజే,
పీజీడీడబ్ల్యూఎంఎం
ప్రస్తుత పదవి : ఎక్సైజ్, క్రీడా, పర్యాటకశాఖల మంత్రి
రాజకీయ ప్రస్థానం : మహబూబ్నగర్ మున్సిపాలిటీలో ఉద్యోగిగా బాధ్యతలు చేపట్టి కమిషనర్గా పదోన్నతి పొందారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. 2014 సంవత్సరంలో గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ మహబూబ్నగర్ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించడంతో పోటీ చేసి 3,139 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అనంతరం 2019 సంవత్సరంలో 57,775 భారీ మెజార్టీతో గెలుపొందారు. అనంతరం ఎక్సైజ్, క్రీడా, పర్యాటక శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.
జననం : 03-02-1962
తల్లిదండ్రులు : నారాయణరెడ్డి, లక్ష్మమ్మ
భార్య : శ్వేత
సంతానం : కుమార్తె స్ఫూర్తి, కుమారుడు స్వరణ్రెడ్డి
స్వస్థలం : ఆవంచ గ్రామం, తిమ్మాజిపేట మండలం,
నాగర్కర్నూల్ జిల్లా
వృత్తి : డాక్టర్
రాజకీయ ప్రస్థానం : 1988లో టీడీపీలో చేరారు. 1993 వరకు ఆవంచ సర్పంచ్గా, 1993 నుంచి 1995 వరకు తిమ్మాజిపేట మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షుడిగా, 1996 నుంచి 1998 వరకు జిల్లా గ్రం థాలయాల సంస్థ అధ్యక్షుడిగా, 1999లో జడ్చర్ల నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడి పోయారు. 2001లో గులాబీ పార్టీలో చేరి 2004లో జడ్చర్ల ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. 2014లో గులాబీ పార్టీ తరఫున జడ్చర్ల ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. విద్యుత్శాఖ మంత్రిగా, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. 2018లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు.
జననం : ఏప్రిల్ 8, 1969
స్వస్థలం : నేరళ్లపల్లి, తిమ్మాజిపేట మండలం,
నాగర్కర్నూల్ జిల్లా
తల్లిదండ్రులు : జంగిరెడ్డి-అమృతమ్మ
భార్య : జమునారాణి
సంతానం : కుమారుడు, కుమార్తె
విద్య : 1987లో బాదేపల్లిలోని జిల్లా పరిషత్
బాయ్స్ హైస్కూల్లో పదో తరగతి పూర్తి చేశాడు.
రాజకీయ ప్రస్థానం : 2012లో తెలుగుదేశం పార్టీ నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. తర్వాత గులాబీ పార్టీలో చేరి 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేసి సమీప కాంగ్రెస్ అభ్యర్థి కూచుకుళ్ల దామోదర్రెడ్డిపై 14,435 ఓట్ల మె జార్టీతో గెలుపొందాడు. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో గులాబీ తరపున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాగం జనార్ధన్రెడ్డిపై 54,354 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు.
జననం : 1977 జూన్ 30
భార్య : గువ్వల అమల , ఇద్దరు కుమారులు
తల్లిదండ్రులు : గువ్వల బక్కమ్మ, రాములు
స్వస్థలం : పొలికెపహడు గ్రామం, గోపాల్పేట
మండలం, వనపర్తి జిల్లా
విద్యాభ్యాసం : ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం,
ఏఎమ్పీపీపీ (ప్రస్తుతం)
రాజకీయ ప్రస్థానం : 2007 అక్టోబర్ 16న వనపర్తిలో ఉద్యమ నేత కేసీఆర్ సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. 2007 నుంచి 2009 వరకు తెలంగాణ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శిగా, 2009-20 14 వరకు అచ్చంపేట అసెంబ్లీ బీఆర్ఎస్ ఇన్చార్జీగా పనిచేశారు. 2009లో పార్లమెంట్ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపో యారు. 2014లో గులాబీ పార్టీ నుంచి అచ్చంపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018లోనూ అదే పార్టీ నుంచి గెలుపొందారు. 2019 సెప్టెంబర్ 7న ప్రభుత్వ విప్గా, 2022 జనవరి 26న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
జననం : 30-09-1968
తల్లిదండ్రులు : వరలక్ష్మమ్మ, రఘుపతిరెడ్డి
భార్య : మంజుల
సంతానం : ఇద్దరు కుమార్తెలు (ప్రీతి, శృతి)
స్వస్థలం : అన్నసాగర్ గ్రామం, భూత్పూర్ మండలం, మహబూబ్ నగర్ జిల్లా
విద్యార్హతలు : సివిల్ ఇంజినీర్
రాజకీయ ప్రస్థానం : 2006లో టీడీపీ నుంచి భూత్పూర్ జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. 2009లో టీడీపీకి రాజీనామా చేశారు 2010లో దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో కేసీఆర్ సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. 2014లో గులాబీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి 15,835 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2018లో రెండోసారి దేవరకద్ర నియోజకవర్గం నుంచి పోటీచేసి 35,504ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
జననం : 31 ఆగస్టు, 1978
స్వస్థలం : సింగోటం, కొల్లాపూర్ నియోజకవర్గం, నాగర్కర్నూల్ జిల్లా
తల్లిదండ్రులు : బీరం లక్ష్మారెడ్డి, బుచ్చమ్మ
భార్య : విజయ
విద్యార్హతలు : ఎల్ఎల్బీ, పదేండ్ల పాటు న్యాయవాది
రాజకీయ ప్రస్థానం : తెలుగుదేశం పార్టీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. కొన్నిరోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. అనంతరం కాంగ్రెస్లో చేరి 2014లో సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి జూపల్లి కృష్ణారావు చేతిలో ఓడిపోయారు. 2018తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో 12,543 ఓట్ల తేడాతో జూపల్లిపై గెలుపొందారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి గులాబీ పార్టీలో చేరారు.
జననం : 21-09-1967
తల్లిదండ్రులు : బీఎస్ వెంకట్రామిరెడ్డి, రేవతమ్మ
భార్య : బండ్ల జ్యోతి,
పిల్లలు : సాయిసాకేత్రెడ్డి
విద్యార్హత : డిగ్రీ
స్వస్థలం : బూరెడ్డిపల్లి, ధరూర్ మండలం, జోగుళాంబ గద్వాల జిల్లా
రాజకీయ ప్రస్థానం : 2004లో టీవీపీ విద్యార్థి సంఘం నాయకుడిగా, ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిగా, 2006లో టీడీపీ తరపున గద్వాల జెడ్పీటీసీగా పనిచేశారు. 2009లో టీడీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. 2013లో వైఎస్ఆర్సీపీలో చేరారు. అనంతరం 2014లో గులాబీ పార్టీలో చేరి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓడిపోయారు. 2018లో గులాబీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2022లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఎంపికయ్యారు.
వయస్సు : 75
తండ్రి: వెంకటన్న
భార్య : విజయలక్ష్మి
పిల్లలు : ఇద్దరు
స్వస్థలం : వల్లూరు గ్రామం, ఇటిక్యాల మండలం,
జోగుళాంబ గద్వాల జిల్లా
వృత్తి : డాక్టర్, (ఎంబీబీఎస్)
రాజకీయం ప్రస్థానం : 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి 1,294 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థిపై ఓడిపోయారు. 2018 జూన్ 9న గులాబీ పార్టీలో చేరి కాంగ్రెస్ అభ్యర్థి సంపత్కుమార్పై 48వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇద్దరు పిల్లలు ఉండగా, పెద్ద కూతురు జ్యోతి దుబాయ్లో ఉంటున్నది. రెండో కూతురు మానసి అమెరికాలో డాక్టర్గా పనిచేస్తున్నారు. కుమారుడు అజయ్ డాక్టర్ కోర్సు పూర్తి చేశాడు. ప్రస్తుతం తండ్రికి రాజకీయాల్లో తోడుగా ఉంటున్నాడు.
జననం : 6 మే 1964
తల్లిదండ్రులు : రాజేశ్వర్రెడ్డి, యశోధర
భార్య : స్వాతిరెడ్డి
సంతానం : డాక్టర్ అమృత్రెడ్డి,
నందికారెడ్డి, అడ్వకేట్
స్వస్థలం : శేరివెంకటాపూర్, కోయిలకొండ
మండలం, మహబూబ్నగర్ జిల్లా
విద్యార్హతలు : ఎం-ఫార్మసీ
రాజకీయ ప్రస్థానం : తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ జీవితం ప్రారంభించారు. 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. 2016 ఫిబ్రవరిలో గులాబీ పార్టీలో చేరారు. 2018లో జరిగిన తెలంగాణ ముంద స్తు ఎన్నికల్లో గులాబీ పార్టీ అభ్యర్థిగా నారాయణపేట నుంచి పోటీ చేసి 15,187ఓట్ల మెజార్టీతో గెలుపొందా రు. 26 జనవరి 2022న బీఆర్ఎస్ నారాయణపేట జి ల్లా అధ్యక్షుడిగా ఎన్నికై కొనసాగుతున్నారు. తెలంగాణ శాసనసభ గ్రంథాలయ కమిటీ సభ్యుడిగా, శాసనసభ వ క్ఫ్ భూములపై హౌస్ కమిటీ సభ్యుడిగా, నవోదయ వి ద్యాసంస్థల చైర్మన్గా కొనసాగుతున్నారు.
జననం : 30 జనవరి 1963
తల్లిదండ్రులు : చిట్టెం నర్సిరెడ్డి, సుమిత్రారెడ్డి
భార్య : సుచరితారెడ్డి
సంతానం : చాణక్య, పృథ్వీష్
స్వస్థలం : ధన్వాడ మండలం, నారాయణపేట జిల్లా
విద్యార్హత : డిగ్రీ
రాజకీయ ప్రస్థానం: చిట్టెం రామ్మోహన్ రెడ్డి తండ్రి చిట్టెం నర్సిరెడ్డి స్వాతంత్య్ర సమరయోధుడు, మూ డుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎమ్మెల్సీగా పని చేశారు. 2005 ఆగస్టు 15న ఎమ్మెల్యేగా ఉన్న చిట్టెం న ర్సిరెడ్డి నక్సలైట్ల కాల్పుల్లో మరణించగా, 2005లో జ రిగిన ఉపఎన్నికలో రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తర పున మక్తల్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలు పొందారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపో యారు. 2014లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. 2016లో గులాబీ పార్టీలో చేరాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో మక్త ల్ నుంచి పోటీచేసి స్వతంత్ర అభ్యర్థి జలందర్రెడ్డిపై 48,315 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.
పుట్టిన తేదీ : 25 ఆగస్టు 1954
తల్లిదండ్రులు : మంగమ్మ, బలరాంయాదవ్
భార్య : రాజ్యందేవి
సంతానం : ముగ్గురు కూతుర్లు, ఒక్క కుమారుడు
స్వస్థలం : తలకొండపల్లి గ్రామం, చల్లంపల్లి
మండలం ( రంగారెడ్డి జిల్లా)
రాజకీయ ప్రస్థానం :- 1981లో చల్లంపల్లి గ్రామ సర్పంచ్ (రెండు సార్లు)
– 1995లో జెడ్పీటీసీ, తలకొండపల్లి
– 1997-1999 బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్
– 1999లో మొదటి సారి ఎమ్మెల్యేగా గెలుపు (టీడీపీ)
– 2006లో జెడ్పీటీసీ, వంగూర్
– 2009 రెండోసారి ఎమ్మెల్యే (టీడీపీ)
– 2018 నుంచి మూడోసారి ఎమ్మెల్యే (బీఆర్ఎస్)