శ్రీశైలం, మార్చి 3 : శ్రీశైలంలో మహాశివరాత్రి ఉ త్సవాల్లో భాగంగా ఆదివారం భ్రమరాంబ, మల్లికార్జునస్వామివార్లు హంసవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. గ్రామోత్సవం అనంతరం కాళరాత్రిపూజ మంత్రపుష్పంతోపాటు స్వామి, అమ్మవార్లకు ఆస్థానసేవ జరిగింది.
వేడుకలకు వివిధ ప్రాంతాల నుంచి భ క్తులు వేలాదిగా తరలిరాగా స్వామి, అమ్మవార్లకు పూ జలు శాస్ర్తోక్తంగా జరిపించినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. గ్రామోత్సవంలో చైర్మన్ చక్రపాణిరెడ్డి, కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు, ధర్మకర్తల మండలి సభ్యులతోపాటు, ఈఈలు రామకృష్ణ, మురళీధర్రెడ్డి, పౌరసంబంధాల అధికారి శ్రీనివాసరావు, ఏఈవోలు, శ్రీ శైల ప్రభ సంపాదకులు, అధికారులు పాల్గొన్నారు.