అలంపూర్, మార్చి 2 : అష్టాదశ శక్తిపీఠాల్లో ఐ దో శక్తిపీఠంగా విరాజిల్లుతున్న అలంపుర్ క్షేత్రం లో మార్చి 4వ తేదీ నుంచి మహా కుంభాభిషేక మహోత్సవం నిర్వహించేందుకు దేవస్థాన నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. సోమవారం నుంచి 8వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహిస్తామని ఆలయ క మిటీ చైర్మన్ చిన్న కృష్ణయ్యనాయుడు, ఈవో పురేందర్కుమార్, ప్రధాన అర్చకులు, పాలక మండలి స భ్యులు పేర్కొన్నారు. కుంభాభిషేకాన్ని శ్రీనివాస్శాస్త్రి చేతుల మీదుగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 4న ఉదయం మహా మంగళహారతి, పుణ్యాహవచనం, ఋత్విక్ వరణం, రక్షాబంధనం, పం చాంగ ప్రాశన, నాంది దేవతాహ్వానం, వాస్తుహో మం, 5, 6న చతుర్వేద పారాయణం, మూలమం త్ర, రుద్ర, చంఢీ హోమం, 7న చతుర్వేద పారాయణం, 8న మహా కుంభాభిషేక మహోత్సవం ని ర్వహించనున్నట్లు తెలిపారు. 12 ఏండ్లకు ఒకసారి నిర్వహించే మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్య లో పాల్గొనాలని కోరారు.
7 నుంచి అలంపూర్ శైవక్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 7న ధ్వజారోహణం, 8న మహాశివరాత్రి, 9న కల్యాణోత్సవం, రాత్రి 7 గంటలకు రథోత్సవం, 10న రావణ వాహనసేవ, సాయంత్రం అశ్వవాహన సేవ (పారువేట), 11న అవభృతోత్సవం, ధ్వజ అవరోహణం, పూర్ణాహుతితో ఉత్సవాలు ముగియనున్నట్లు ప్రధాన అ ర్చకులు శ్రీకాంత్శర్మ, ఆనంద్శర్మ తెలిపారు.