కల్వకుర్తి, ఏప్రిల్ 13 : కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మూడు నెలల్లోనే హామీల అమలులో విఫలమైందని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ విమర్శించారు. శనివారం కల్వకుర్తిలోని వైఆర్ఆర్ కాంప్లెక్స్లో నియోజకవర్గస్థాయి సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించగా మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, జెడ్పీటీసీలు ఉప్పల వెంకటేశ్, విజితారెడ్డి, దశరథ్నాయ క్, ఫుడ్ కమిషన్ చైర్మన్ గోళి శ్రీనివాస్రెడ్డితో కలిసి జైపాల్యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలాల వారీగా సమన్వయ కమిటీ సభ్యుల నుంచి అభిప్రాయాలను స్వీకరించారు.
అనంతరం జైపాల్యాదవ్ మా ట్లాడుతూ.. కాంగ్రెస్ నేతల ను ప్రజలు, రైతులు ఈసడించుకుంటున్నారన్నారు. గ్రా మాల వారీగా కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ కేం ద్రంలో బీజేపీ చేస్తున్న దమనకాండను ప్రజలకు వివరించాలన్నారు. పథకాలను పక్కనబెట్టి కాంగ్రెస్ నేతలు సొంత పనులను చేసుకుంటున్నారనే విషయాలను ప్రజలకు వివరించాలన్నారు. ఎన్నికల్లో డీ-82పై గప్పాలు కొట్టిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్తో కలి సి త్వరలోనే కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకుందామన్నారు. గ్రామాల్లో ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకతను సమర్థవంతగా వినియోగించుకుందామని పిలుపునిచ్చారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, నాయకులు విజయ్గౌడ్, వైస్ ఎంపీపీ గోవర్ధన్, చెన్నకేశవులు, ఎల్ఎన్ రెడ్డి, జంగయ్య, శ్రీనివాస్యాదవ్ తదితరులున్నారు.