స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 2 : పార్కింగ్ అడ్డా డబ్బులు ఆర్టీసీ తిరిగి చెల్లించకపోవడంతో మనోవేదనకు గురైన రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందిన ఘటన జనగామ జిల్లా స్టేషన్ఘన్ఫూర్లో చోటుచేసుకున్నది. మృతుడి కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. స్టేషన్ఘన్పూర్కు చెందిన బోసు ఐలయ్య (75) 1990లో ఆర్టీసీ డైవర్గా విధుల్లో చేరి 2013లో రిటైర్ అయ్యారు. 2016లో స్టేషన్ఘన్పూర్ బస్స్టాండ్లో లీజుపై పార్కింగ్ అడ్డా తీసుకున్నాడు. బస్ స్టాండ్లో చిన్న, చిన్న కాంట్రాక్టు పనులు చేసేవాడు. గత ఏప్రిల్లో పార్కింగ్ అడ్డాను రద్దు చేసుకున్నాక అడ్వాన్స్తోపాటు కాంట్రాక్టు పనులకు సంబంధించిన రూ.4 లక్షలను ఆర్టీసీ తిరిగి చెల్లించలేదు.
డబ్బుల కోసం ఐలయ్య రెండేండ్లుగా వరంగల్ రీజినల్ మేనేజర్, -1డిపో మేనేజర్ను కలిసి విన్నవించినా డబ్బులు చెల్లించలేదు. దీంతో మనోవేదనకు గురై 2025 అక్టోబర్ 7న ఆత్మహత్యకు యత్నించాడు. అయినా నేటికీ ఆర్టీసీ అడ్డా అడ్వాన్స్ చెల్లించలేదు. దీంతో పది రోజుల క్రితం ఐలయ్య అస్వస్థతకు గురవడంతో హైదరాబాద్లోని నిమ్స్కు వెళ్లగా వైద్యు లు పరీక్షించి బైపాస్ సర్జరీ చేశారు. చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆర్టీసీ చెల్లించాల్సిన బకాయి డబ్బులు రాలేదని ఆవేదతో శనివారం గుం డెపోటువచ్చి మృతిచెందాడు. అప్పులు చేసి పార్కింగ్ అడ్డాకు అడ్వాన్స్ ఇచ్చాడని, వీటిని తీర్చలేక మనో వ్యధకు గురై గుండెపోటుతో మృతిచెందాడని కుటుంబసభ్యులు తెలిపారు.