అభివృద్ధే తమ అభిమతమని.. డెవలప్ చేసేందుకు ఎంత దూరమైనా వెళ్తామని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. బుధవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో, హన్వాడలో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన పదేండ్లల్లో జరిగిన అభివృద్ధిని బేరీజు వేసుకొని మంచి చేస్తున్న బీఆర్ఎస్కు అండగా నిలబడాలని కోరారు.
మహబూబ్నగర్ టౌన్, నవంబర్ 15 : ప్రజల ఆదరాభిమానాలతో సాధ్యమైనంత వరకు అభివృద్ధి చేస్తున్నామని, మరోసారి ఆదరిస్తే మరింత ప్రగతి సాధిస్తామని ఎక్సైజ్, క్రీడాశాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని 46వ వార్డులోని మొన్నప్పగుట్ట, ఝాన్సీనగర్, 47వార్డులో కిద్వాయిపేట, వివేకానంద నగర్ కాలనీల్లో మంత్రి శ్రీనివాస్గౌడ్ ఎన్నికల ప్రచా రం నిర్వహించారు. కా లనీవాసులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. అభివృద్ధి చేసి న మీకే మా ఓటు వే స్తామని ప్రజలు స్ప ష్టం చేశారు. అనంత రం మంత్రి ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. పదేండ్లలో చేపట్టిన అభివృద్ధి వివరిస్తూ మ్యానిఫెస్టో కరపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. కిద్వాయిపేటలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మిస్తామన్నారు. సూపర్స్ఫెషాలిటీ దవాఖానతో ఎంతో మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. అభివృద్ధి మా మతమని, కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో దాడులు చేసే వారు ఉన్నారని, ప్రతిఒక్కరూ గమనించాలని కోరారు.
చెప్పిందే కాదు చెప్పని పనులను కూడా ఎంతో అభివృద్ధి చేశామన్నారు. మహబూబ్నగర్ 2014 సంవత్సరానికి ముందు, తర్వాత ఒకసారి మనస్సుపెట్టి అలోచించి ప్రజలు చూడాలన్నారు. మంత్రిగా రోజుకు కేవలం నాలుగు గంటలు మాత్రమే నిద్రపోయేవాడినని, ఎప్పుడు ఎవరికీ ఆపద వచ్చినా అర్ధరాత్రి దవాఖానకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకొని వైద్య సదుపాయాలను అందించి కాపాడుకోవడం జరిగిందన్నారు. మహబూబ్నగర్ను దశదిశలా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా శ్రమిస్తున్నట్లు తెలిపారు. ఓటుతో మీకు ఐదేండ్లపాటు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సేవ చేస్తానన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేశ్, కౌన్సిలర్ గోవింద్, నాయకులు బాలస్వామి, బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, అభిమనులు ఉన్నారు.
పాలమూరు, నవంబర్ 15 : పదేండ్లలో పట్టణంలో చేపట్టిన అభివృద్ధిని చూసి ఓటేయాలని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మొట్టుగడ్డలోని డైట్ కళాశాలలో బుధవారం మంత్రి మార్నింగ్ వాకింగ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రికి వాకర్స్ ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గడిచిన పదేండ్లలో పట్టణంలో చేపట్టిన అభివృద్ధిని గమనించి ఓటు వేయాలని కోరారు. దేశంలోనే అతిపెద్ద ఎనర్జీ పార్కు దివిటిపల్లిలో ఏర్పాటు చేశామన్నారు. జేఎన్టీయూ, దివిటిపల్లి వరకు హైవేతోపాటు మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, కౌన్సిలర్ రోజావెంకటేశ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్వర్, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుదీప్రెడ్డి, మార్నింగ్ వాకర్స్ పాల్గొన్నారు.
హన్వాడ, నవంబర్ 15 : మండలంలోని కిష్టంపల్లి, గొండ్యాల, కిష్టంపల్లి గేటు తండా, ఎర్రగట్టుతండా గ్రామాల్లో మంత్రి శ్రీనివాస్గౌడ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంత్రికి ఆయా గ్రామాల ప్రజలు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలరాజు, జెడ్పీటీసీ విజయనిర్మల, రామణారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కారుణాకర్గౌడ్, వైస్ ఎంపీపీ లక్ష్మి, సర్పంచులు సరస్వతి, లక్ష్మి, అచ్చానాయక్, వెంకటయ్య, సింగిల్ విండో వైస్ చైర్మన్ వెంకటయ్య, కృష్ణయ్యగౌడ్, ఎంపీటీసీలు శేఖర్, సోనిబాయి పాల్గొన్నారు.