మదనాపురం, ఫిబ్రవరి 11 : చలో నల్లగొండ సభను విజయవంతం చేద్దామని బీఆర్ఎస్ కార్యకర్తలకు దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని దుప్పల్లిలో ఆదివారం పలు శుభకార్యాలకు హాజరై కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణానదిపై తెలంగాణ ప్రాజెక్టులు, నీటి హక్కులను హరించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్ర సంస్థ కేఆర్ఎంబీకి అధికారమివ్వడం ద్వారా జరుగబోయే దుష్పరిణామాలను ఖండిస్తూ, తెలంగాణ సమాజానికి వివరించేందుకు నల్లగొండలో 13న బహిరంగ సభ నిర్వహిస్తున్నారని తెలిపారు.
సభకు భారీ గా తరలివచ్చి విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండలానికి చెందిన బీ ఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.